‘కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది’

Bandi Sanjay Slams On KCR Over Dalita Bandu At Jan Ashirwad Yatra - Sakshi

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

సాక్షి, హైదారబాద్‌: ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ పనిచేస్తారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీతాఫలమండి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పేరుతో పేరుతో మరోసారి దళితులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.

చదవండి: ‘దేశానికి మంత్రినైనా అంబర్‌పేటకు ముద్దు బిడ్డనే’

సీఎం కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కేసీఆర్‌ పాలన గాలికొదిలేశారని, కరోనా సమయంలో బీజేపీ మాత్రమే ప్రజలకు అండగా ఉందని బండి సంజయ్‌ తెలిపారు. ఈ యాత్రలో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్య పాల్గొన్నారు.
చదవండి: గెలుపు ఖాయం, మెజారిటీపైనే దృష్టి పెట్టండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top