రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు

AP BJP President Somu Veerraju Comments On Chandrababu - Sakshi

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అమరావతిలో అన్ని తాత్కాలిక భవనాలేనని దుయ్యబట్టారు. రూ.7,200 కోట్లు ఖర్చు చేసి ఒక్క శాశ్వత భవనం కట్టలేకపోయారని ధ్వజమెత్తారు. అమరావతి కోసం వేల ఎకరాలు సేకరించి రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. చంద్రబాబు ఉపాధి పథకాన్ని పక్కదారి పట్టించి రూ.కోట్లు దోచేశారని సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. (చదవండి: ఎవరు చెబితే ఎన్నికలు నిర్వహిస్తున్నారు?)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top