
సమ్మె నోటీసు అందజేత
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): దేశవ్యాప్తంగా జూలై 9న చేపట్టే సమ్మెలో పాల్గొంటామంటూ ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్ మంగళవారం యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందజేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్మికులకు నష్టం కలిగించేలా ఉన్న నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈక్రమంలో చేపట్టి న సమ్మెలో కార్మికులు పాల్గొనాలని ఆయన కో రారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమల చందర్, వేల్పుల కుమారస్వామి, రమేశ్, నరేశ్, విశ్వనాథ్, రత్నకుమార్ పాల్గొన్నారు.
28న కలెక్టరేట్లో జాబ్మేళా
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్లోని జిల్లా ఉపాధిక ల్పనాధికారి కార్యాలయంలో ఈనెల 28న జా బ్మేళా నిర్వహించనున్నట్లు ఇన్చార్జి అధికారి తిరుపతిరావు మంగళవారం తెలిపారు. అపోలో ఫార్మసీలో 40 ఫార్మసిస్టు, 20 ట్రెయినీ ఫార్మసిస్టు పోస్టుల భర్తీకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగలవారు ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్లతో నేరుగా హాజరు కావాలన్నారు. వివరాలకు 72079 17714, 81212 62441 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలోని క్రీడాపాఠశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఆసక్తిగల జిల్లా విద్యార్థులకు ఈనెల 26న జిల్లాస్థాయి పోటీలను ని ర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శా ఖ అధికారి సురేశ్ మంగళవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ ఆవరణలోని మైదానంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. మండల స్థాయిపోటీల్లో ఎంపిౖకైన విద్యార్థులు జిల్లాస్థా యి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
ఆర్ఎంపీలు సేవాభావంతో చికిత్స అందించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ఆర్ఎంపీలు సేవాభావంతో ప్రథమ చికిత్స అందించాలని డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆర్ఎంపీలతో సమావేశమై పలు సూచనలిచ్చారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్లాంటి జ్వరాలతో క్లినిక్లకు వచ్చేవారికి ఫ్లూయిడ్స్, ఇంజక్షన్ చేయవద్దన్నారు. అలాంటి వారిని సమీపంలోని పీహెచ్సీ, ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేలా సూచించాలని అన్నారు. గర్భస్రావం కోసం మందులు ఇవ్వొద్దన్నారు. 12 వారాల గర్భానికి ఉచితంగానే ప్రభుత్వాసుపత్రుల్లో గర్భస్రావాలు చేస్తారని అన్నారు. బయోవ్యర్థాల తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పంచాయతీ సిబ్బంది తీసుకెళ్లే చెత్తలో వేయవద్దని ఆమె సూచించారు.
జీజీహెచ్లో వివాదం
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో కాంట్రాక్ట్ సూపర్వైజర్, నర్సింగ్ ఆఫీసర్ల మధ్య చెలరేగిన వివాదం ఇంకా వీడడం లేదు. మంగళవారం మరోసారి ఇరువర్గాలు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. సూపర్వైజర్పై న ర్సింగ్ ఆఫీసర్లు ఇప్పటికే సూపరింటెండెంట్పై ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. మంగళవారం మరోసారి గొడవ చోటుచేసుకోవడంతో విషయం తెలిసిన ఆర్ఎంవో రాజు స్పందించా రు. ఇరువర్గాలతో మాట్లాడి వివాదం ముదురకుండా శాంతింపజేశారు. తమ మనోభావాలకు భంగం కలిగించేలా మాట్లాడారని పలువురు నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు.
మొక్కలు నాటి కాపాడాలి
పెద్దపల్లిరూరల్: భారత ప్రధాని నరేంద్రమోదీ అమ్మ పేరుతో ఒక మొక్క(ఏక్ పేడ్ మా కే నామ్) నాటాలని ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా ఇన్చార్జి సోమారపు లావ ణ్య స్థానిక నేతలతో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలో మొక్కలు నాటారు. మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతిని కలుషితం కాకుండా కాపాడుకునేందుకు విరివిగా మొక్కలను నాటి సంరక్షించాల్సిన అవసరముందని ఆమె అన్నారు. కార్యక్రమంలో నాయకులు తంగెడ రాజేశ్వర్రావు, రాజగోపాల్, పెంజర్ల రాకేశ్, ఎ ర్రోళ్ల శ్రీకాంత్, ఉమేశ్, వేల్పుల శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, మొగిలి, తిరుపతి, వెంకటస్వామి, మహేశ్, కిరణ్, అజయ్ పాల్గొన్నారు.

సమ్మె నోటీసు అందజేత