రైతులకు అవగాహన కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

రైతులకు అవగాహన కల్పిస్తాం

Jun 25 2025 7:06 AM | Updated on Jun 25 2025 7:06 AM

రైతులకు అవగాహన కల్పిస్తాం

రైతులకు అవగాహన కల్పిస్తాం

పెద్దపల్లిరూరల్‌: రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబ డి సాయం అందించిన ప్రభుత్వం మంగళవారం రైతుభరోసా విజయోత్సవం నిర్వహించింది. రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. రాఘవాపూర్‌లోని రైతువేదిక నుంచి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఈ కార్యక్రమానికి హాజరయ్యా రు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకు సాగుతోందని సీఎం అన్నారు. పంట కాలానికి పెట్టుబడి అందించాలనే ఆలోచనతోనే కేవలం 9రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశామని అన్నారు. ఈ విషయంపై జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తామని కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, ఏడీఏ కాంతారావు, మండల వ్యవసాయాధికారి అలివేణి, పెద్దపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ నర్సింహారెడ్డితోపాటు పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రైతునేస్తం ప్రయోజనకరం

రామగిరి(మంథని): రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతునేస్తం కార్యక్రమం ఎంతో ఉపయోగకరం కానున్నదని అడిషనల్‌ కలెక్టర్‌ వేణు అన్నారు. రత్నాపూర్‌ రైతువేదికలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా లబ్ధిదారులతో వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడగా, అదనపు కలెక్టర్‌ వేణు హాజరయ్యారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రైతులు సాగుచేసి లాభాలు సాధించాలని అన్నారు. రైతు దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట వేసే వరకూ పంటలపై వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఇదోక వేదికలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సుమన్‌, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌, ఏఈవో అరవింద్‌, నవీన్‌, మౌనిక, రైతులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

రాఘవాపూర్‌లో రైతుభరోసా వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement