
● మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టి ● వార్డు అధికారులు కా
రైతువేదికలకు డబ్బులు
● విడుదల చేసిన వ్యవసాయ శాఖ
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాల కోసం ఎట్టకేలకు నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి రైతు భరోసా పథకం ప్రారంభం, ముగింపు సందర్భంగా రైతు వేదికల వద్ద సీఎంతో ముఖాముఖి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతీ రైతు వేదికకు 200 మంది రైతులను తరలించాలని ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లకు టార్గెట్లు విధించింది. ఇటీవల జరిగిన కార్యక్రమానికి రైతులను తరలించడం, వారికి టీ, స్నాక్స్ ఖ ర్చులను భరించడం వంటి పనులు ఏఈవోలే చూ సుకున్నారు. తాజాగా ముగింపు వేడుకులకు సైతం ఏఈవోలు నిర్వహించాలని చెప్పడంతో వారంతా తలలు పట్టుకున్నారు. గత వేడుక డబ్బులే రాకపోగా, మరోసారి చేతి నుంచి డబ్బులు ఎలా పెట్టుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అన్నదాతా.. రైతువేదికకు రావా?’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. మంగళవారం మధ్యాహ్నం అన్ని రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏఈవోలకు కావాల్సిన నిధులు విడుదల చేసింది.
వన మహోత్సవ లక్ష్యం 4.80 లక్షల మొక్కలు
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఈ ఏడాది 4.80 లక్షలు నాటడం లక్ష్యంగా ప్రభు త్వం నిర్దేశించిందని అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ అన్నారు. రా మగుండం మున్సిపల్ కార్యాలయంలో మంగళవా రం వార్డు అధికారులతో కమిషనర్ వన మహోత్సవంపై సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు మొ క్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్పీల సహకారంతో ఇంటింటి సర్వే చేసి అవసరమైన పండ్లు, పూలజా తిమొక్క లను నర్సరీల నుంచి తెప్పించాలని ఆమె సూచించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయా లని కమిషనర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను చైతన్యపరిచి ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసుకునేలా చూడాలని ఆమె సూచించారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షాభాజ్, అధికారులు హనుమంతరావు నాయక్, తేజస్విని, ఆంజనేయులు, నాగభూషణం, కుమారస్వామి, శ్రీనివా్ పాల్గొన్నారు.

● మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టి ● వార్డు అధికారులు కా

● మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టి ● వార్డు అధికారులు కా