ఇంకుడుగుంతల శుభ్రం | - | Sakshi
Sakshi News home page

ఇంకుడుగుంతల శుభ్రం

Jun 24 2025 3:59 AM | Updated on Jun 24 2025 3:59 AM

ఇంకుడ

ఇంకుడుగుంతల శుభ్రం

కోల్‌సిటీ(రామగుండం): ఎట్టకేలకు బల్దియా అధికారులు ఇంకుడుగుంతలపై దృష్టి పెట్టారు. ‘ఇంకని నీరు.. ఆనవాళ్లు కోల్పోతున్న ఇంకుడుగుంతలు’ శీర్షికన గతనెల 19న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన రామగుండం బల్దియా అధికారులు, వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆనవాళ్లు కోల్పోయిన ఇంకుడుగుంతలను వినియోగంలోకి తీసుకురావడంపై దృష్టి సారించారు. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణలోని రెండు ఇంకుడుగుంతలతోపాటు నగరపాలక సంస్థ కార్యాలయం వెనకాల మరో రెండింటింటిని శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కుమారస్వామి, ఎన్విరాన్మెంట్‌ ఇంజినీర్‌ మధుకర్‌, ఎంఐఎస్‌ ఆపరేటర్‌ శ్రీకాంత్‌, మెప్మా సీవో శ్వేత, ఊర్మిళ, ప్రియదర్శిని పాల్గొన్నారు.

సింగరేణి పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): మంచిర్యాల జిల్లా సీసీసీ– నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సింగరేణి ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్‌ సోమవారం తెలిపారు. కళాశాలలో మొత్తం 300 సీట్లు భర్తీచేస్తామన్నారు. సివిల్‌, కంప్యూటర్స్‌, ఎలిక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, మైని ంగ్‌ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయని, పాలిసెట్‌–2025లో ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఇందులో 150 సీట్లు సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలకు కేటాయించామన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 28 నుంచి జూలై 3వ తేదీ వరకు సింగరేణి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగిలిన సీట్లను కన్వీనర్‌ కోటా కింద ఇతరులకు కేటాయిస్తామని, వీరు తెలంగాణ ప్రభుత్వ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 24నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఇతర వివరాల కోసం 90102 22161, 87901 12515, 94911 44168 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కరీంనగర్‌రూరల్‌: చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన విష్ణువర్థన్‌(29) బహుదూర్‌ఖాన్‌పేట శివారులో ద్విచక్ర అదుపు తప్పి కింద పడడంతో మృతి చెందాడు. కరీంనగర్‌రూరల్‌ సీఐ ఏ.నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగునూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న విష్ణువర్ధన్‌ సోమవారం వెదురుగట్ట నుంచి ప్రతిమ ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యలోని బహుదూర్‌ఖాన్‌పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి సమీపంలోని చెట్టుకు ఢీకొంది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

హుజూరాబాద్‌లో..

హుజూరాబాద్‌: పట్టణానికి చెందిన ఓ న్యూస్‌ పేపర్‌ రిపోర్టర్‌ చిర్ర సుదర్శన్‌గౌడ్‌ (55) ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. హుస్నాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌ గ్రామ శివారులో బైక్‌ అదుపు తప్పడంతో కందకంలో పడి మృతి చెందాడని. మృతుడి కుటుంబానికి తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రూ.పదివేలు అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, హుజూరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కాయిత రాములు, పలువురు జర్నలిస్టులు పరామర్శించారు.

27న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌ 1డిపో నుంచి ఈనెల 27న వన్‌ డే టూర్‌ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ విజయమాధురి తెలిపారు. టూర్‌ ప్యాకేజీలో చిలుకూరు బాలాజీ, అనంత పద్మనాభ స్వామి, ఏడుపాయల దేవాలయం, అనంతగిరి హిల్స్‌ను సందర్శించేందుకు సూపర్‌ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని అన్నారు. 27న ఉదయం 4గంటలకు కరీంనగర్‌ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9గంటలకు తిరిగి కరీంనగర్‌కు చేరుకుంటుందని, పెద్దలకు రూ.1.430. పిల్లలకు రూ.900 టికెట్‌ ఉంటుందని డిపో మేనేజర్‌ తెలిపారు.

ఇంకుడుగుంతల శుభ్రం 1
1/2

ఇంకుడుగుంతల శుభ్రం

ఇంకుడుగుంతల శుభ్రం 2
2/2

ఇంకుడుగుంతల శుభ్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement