
మహిళా ఠాణాకు పోలీస్ అధికారుల నియామకం
● రెండు కొత్త పోలీస్ స్టేషన్లకూ ఎస్సైలు
గోదావరిఖని: జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రారంభించే మహిళా పోలీస్స్టేషన్కు ఇద్దరు పోలీసు అధికారులను నియమిస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా గురువారం ఆదేశాలు జారీచేశారు. కమిషనరేట్లోని సీఎస్బీ–3 సీఐగా పనిచేస్తున్న కె.పురుషోత్తంను మహిళా పోలీస్స్టేషన్ సీఐగా, వీఆర్ రామగుండంలో కొనసాగుతున్న జి.అశోక్రెడ్డిని ఎస్సైగా బదిలీ చేశారు. అదేవిధంగా పెద్దపల్లి ఎస్సై–2గా పనిచేస్తున్న బుద్దె మల్లేశ్ను పెద్దపల్లి రూరల్ పోలీస్స్టేషన్కు ఎస్సైగా బదిలీ చేశారు. వీఆర్ రామగుండంలో పనిచేస్తున్న టి.సత్యనారాయణను ఎలిగేడు పోలీస్స్టేషన్ ఎస్సైగా బదిలీ చేస్తూ ఆదేశిలిచ్చారు.

మహిళా ఠాణాకు పోలీస్ అధికారుల నియామకం

మహిళా ఠాణాకు పోలీస్ అధికారుల నియామకం

మహిళా ఠాణాకు పోలీస్ అధికారుల నియామకం