పకడ్బందీగా పాలన | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పాలన

Jun 14 2025 10:24 AM | Updated on Jun 14 2025 10:24 AM

పకడ్బందీగా పాలన

పకడ్బందీగా పాలన

గోదావరిఖని: సుమారు దశాబ్ద కాలం తర్వాత సింగరేణి బొగ్గు గనుల సంస్థలో అత్యంత కీలక పోస్టులో ఐఏఎస్‌ అధికారిని కేటాయించింది. 2014లో సింగరేణి డైరెక్టర్‌(పా– పర్సనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌)గా ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ సేవలు అందించారు. ఆ తర్వాత మళ్లీ ఈ పోస్టుకు ఐఏఎస్‌ అధికారిని నియమించలేదు. అదనపు బాధ్యతలతోనే సింగరేణి యాజమాన్యం ఇప్పటిదాకా నెట్టుకుంటూ వస్తోంది.

గత డైరెక్టర్‌ (పా) తీరు

వివాదాస్పదం కావడంతో..

సింగరేణి సంస్థలో కీలకంగా ఉండే పర్సనల్‌, అడ్మినిస్ట్రేటివ్‌, వెల్పేర్‌(పీఏడబ్ల్యూ) విభాగాలకు అధిపతిగా డైరెక్టర్‌(పా) వ్యవహరిస్తారు. ఈపోస్టు సింగరేణిలో చాలా కీలకం. అయితే గతంలో పనిచేసిన డైరెక్టర్‌(పా) వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో ఆ తర్వాత ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియమించలేదు. అప్పటి నుంచి ఇప్పటి దాకా సింగరేణిలోని వివిధ విభాగాల డైరెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. నెట్టుకుంటూ వస్తోంది. డైరెక్టర్‌ పీపీ, డైరెక్టర్‌ ఓపీ ఈ విభాగాన్ని చూస్తూ వస్తున్నారు. దీంతో సంస్థ ఉద్యోగులు, యాజమాన్యానికి, కార్మికుల సంక్షేమం, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన అనేక పనుల్లో జాప్యం కావడం, సమస్యలు అపరిష్కృతంగాఉండడం అవుతూ వస్తున్నాయి. వాస్తవానికి రెండు కీలక డైరెక్టర్లు గనుల యజమానులుగా వ్యవహరించడం, వాటి పర్యావరణ అనుమతులు, ఉత్పత్తి, ఉత్పాదతక మిగతా వ్యవహారాలతోనే ఎక్కువగా ఉండటంతో అదనపు బాధ్యతలు నిర్వర్తించడం వారికి ఇబ్బందిగా మారింది. ఈక్రమంలో అనేక ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యం ఏర్పడుతూ వస్తోంది.

సంస్థలో కీలకం డైరెక్టర్‌(పా)

తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనుల సంస్థలో సుమారు 40 వేల మంది పర్మినెంట్‌ కార్మికులు, దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే సంస్థలోని మొత్తం 11 ఏరియాల్లో సంస్థ ఉద్యోగుల వ్యవహారాలు, పరిపాలన, సంక్షేమం డైరెక్టర్‌(పా) పర్యవేక్షిస్తారు. పర్సనల్‌ విభాగం, నియామకాలు, సంక్షేమ విభాగం, మానవ వనరుల విభాగం, ఎడ్యుకేషనల్‌ సొసైటీ పారిశ్రామిక సంబంధాలు, ఎస్టేట్‌, ఎగ్జిక్యూటివ్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ(సీఎస్‌ఆర్‌) విభాగాలు డైరెక్టర్‌(పా) పరిధిలో ఉంటాయి. ఈక్రమంలో సంస్థ లో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐ ఏఎస్‌ స్థాయి అధికారి నియామకంతో కార్మికుల సమస్యలను మానవతా దృక్పథంతో ఆలోచించి న్యాయం చేస్తారని కార్మికులు ఎంతోఆశగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో దాదాపు దశాబ్దం తర్వాత ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియ మించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పనుల్లో వేగవంతం పెరిగి సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.

సింగరేణి డైరెక్టర్‌(పా)గా ఐఏఎస్‌ ఆఫీసర్‌

దశాబ్దకాలం తర్వాత సివిల్స్‌ అధికారి నియామకం

ఇప్పటి వరకు అదనపు బాధ్యతలతోనే సరిపెట్టిన వైనం

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంటున్న కార్మికలోకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement