చిన్నారులకు అక్షరాభ్యాసం | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు అక్షరాభ్యాసం

Jun 14 2025 10:14 AM | Updated on Jun 14 2025 10:24 AM

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతోపా టు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. గర్రెపల్లి మండల ప రిషత్‌ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చిన్నారులకు ఆమె అక్షరాభ్యాసం చేయించారు. డీఈవో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావంతులైన, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు అధిక వ్యయప్రయాసలకు వెళ్లకుండా ఉచిత విద్య కోసం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆమె కోరారు. ఎంఈవో ఆరెపల్లి రాజయ్య, పీఏపీసీ చైర్‌పర్సన్‌ గౌతమి, హెచ్‌ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

‘కస్తూరిబా’లో కొత్త మెనూ

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త మెనూ అమలు చేస్తున్నా రు. ఈమేరకు భూపతిపూర్‌ ఇటీవల వంటల తయారీపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 10 కేజీబీవీలు ఉన్నాయి. నెలకు రెండుసార్లు మటన్‌, ఐదుసార్లు చికెన్‌, వారంలో 5 సార్లు గుడ్లు, రోజూ అల్పాహారం అందిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెనూ రూపొందించారు.

జూలపల్లిలో భారీవర్షం

జూలపల్లి(పెద్దపల్లి): వివిధ గ్రామాల్లో శుక్రవారం భారీవర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమై సుమారు ఇరవై రోజులు కావస్తున్నా.. ఆశించిన స్థాయిలో వానలు కురవలేదు. దీంతో అన్నదాతలు ఇప్పటివరకు వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేక పోయారు. పత్తికి దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో భారీ వర్షం కురవడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాలు పెట్టేందుకు అనువైన వర్షం కురిసిందని వారు అటున్నారు.

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు

కమాన్‌పూర్‌(మంథని): మంథని ఆరీసీ డిపో నుంచి తెలంగాణలోని వివిధ పుణ్యక్షేత్రాలకు ఈనెల 27న ప్రత్యేక టూర్‌ సూపర్‌ లగ్జరీ బస్సు నడిపిస్తామని డీఎం శ్రవణ్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఈనెల 27న రాత్రి 11 గంటలకు మంథనిలో బస్సు బయలు దేరుతుందన్నారు. యాదగిరరిగుట్ట, స్వర్ణగిరి దర్శనం అనంతరం వరంగల్‌ భద్రకాళి, వేయి స్తంభాల గుడి దర్శన సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. మళ్లీ రాత్రి 10 గంటలకు మంథని చేరుకుటుందని తెలిపారు. ఈ టూర్‌ ప్యాకేజీ రూ.1,090 ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 99592 25923, 94913 24172 నంబర్లలో సంద్రించాలని ఆయన కోరారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అమ్మోనియా ఉత్పత్తి ప్రారంభం

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): వార్షిక మరమ్మతుల నేపథ్యంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో గత మే 6న ఉత్పత్తి నిలిపివేశారు. పనులు పూర్తికావడంతో శుక్రవారం వేకువజామున అమ్మోనియా ప్లాంట్‌లోని హెచ్‌టీఆర్‌ను పునరుద్ధరించారు. దీంతో అమ్మోనియా ఉత్ప త్తి ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో యూరియా ఉత్పత్తి చేస్తారు. ప్లాంట్‌ రోజూ 3,500 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి చే స్తుంది. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో యూరియాకు డిమాండ్‌ అధి కంగా ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌ఎఫ్‌సీఎల్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి.

చిన్నారులకు అక్షరాభ్యాసం 
1
1/3

చిన్నారులకు అక్షరాభ్యాసం

చిన్నారులకు అక్షరాభ్యాసం 
2
2/3

చిన్నారులకు అక్షరాభ్యాసం

చిన్నారులకు అక్షరాభ్యాసం 
3
3/3

చిన్నారులకు అక్షరాభ్యాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement