
‘గులాబీ’లకూ ఇళ్లు
సాక్షి, పెద్దపల్లి/ఎలిగేడు: పింక్షర్ట్ వేసుకున్నా అర్హులైతే చాలు.. పార్టీలకతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఐటీ పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఎలిగేడు లో కొత్త పోలీసుస్టేషన్, కలెక్టరేట్ సమీపంలో ట్రాఫి క్, రూరల్, వ్యవసాయ మార్కెట్లో మహిళా పోలీ స్ స్టేషన్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో సమీకృతమార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చందపల్లి, రాంపల్లిలో నిర్మించిన 466 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎలిగేడు, చందపల్లిలో జరిగిన సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. నిత్యం ప్రజలతో ఉంటూ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసే నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అని అభినందించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గురుకులాల్లో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంచామని, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన డబుల్బెడ్రూమ్ ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు పంచామని తెలిపారు. మిగిలిన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో మరో 1,000 ఇళ్ల కోసం బఫర్ కింద అదనంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్కు సూచించారు
నేరస్తులను శిక్షించాలి : దుద్దిళ్ల శ్రీధర్బాబు
నేరస్తులు ఎంతటివారైనా శిక్ష పడితే ఇంకొకరు నేరం చేయరని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరిట ఆ పార్టీ నాయకులకే ఫ్రెండ్లీగా ఉన్నారని విమర్శించారు. రో డ్డుపై న్యాయవాద దంపతులను హత్య చేస్తే ఆనాటి ప్రభుత్వం అసలైన నిందితులను కేసు నుంచి తప్పించిందని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్మిస్తే ఆ ప్రాంతవాసులకు మెరుగైన చికిత్స అందాలని కోరుకుంటామని, అలాగే పోలీస్స్టేషన్కు రావాల్సిన పరిస్థితి ఎవరికీ రావొద్దని సూ చించారు. ఎలిగేడు మండలవాసుల కోసం వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజయరమణరావు విజ్ఞప్తి చేశారు. రూ.82 కోట్లతో బైపాస్ రోడ్డు పనులకు టెండర్లు పూర్తయ్యాయని, రూ.52 కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నామని, వచ్చే సంక్రాంతి నాటికి ఆర్టీసీ బస్ డిపో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ, రామగుండం పట్టణంలో మరో తహసీల్దార్ కా ర్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్రెడ్డి, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులైతేచాలు పింక్షర్ట్ వేసుకున్నా మంజూరు చేస్తాం
పార్టీలకతీతంగా ఇళ్ల కేటాయింపు
జిల్లాకు అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
లబ్ధిదారులకు డబుల్బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ
ఎలిగేడులో కొత్త పోలీస్స్టేషన్ ప్రారంభం
జిల్లా కేంద్రంలో రూరల్, ట్రాఫిక్, మహిళా ఠాణాల ప్రారంభోత్సవం
తొలి ఎస్సైగా సత్యనారాయణ
మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు సమక్షంలో ఎలిగేడు పోలీస్స్టేషన్ తొలి ఎస్సైగా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా సేవలు అందిస్తానని ఎస్సై తెలిపారు.

‘గులాబీ’లకూ ఇళ్లు

‘గులాబీ’లకూ ఇళ్లు

‘గులాబీ’లకూ ఇళ్లు