
రైస్మిల్లులో అధికారుల విచారణ
● రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయ్, రెవెన్యూ శాఖలు
మంథని: సూరయ్యపల్లి గ్రామంలోని ఓ రైస్ మి ల్లులో బుధవారం ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మళ్లీ విచారణ చేపట్టారు. 2022–23, 2023–24 సంవత్సరాల్లో రైస్ మిల్లుకు పౌర సరఫరాల శాఖ ద్వారా కేటాయించిన ధాన్యం నిల్వలపై గత మార్చి 28న టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తొలుత తనిఖీలు చేసిన అధికారులు.. గంగాపురిలోని మరోరైస్ మిల్లు గోదాంలో నిల్వ చేసిన ధాన్యం తనిఖీ చేశారు, అయితే రెండు సంవత్సరాలకు సంబంధించి 41,365 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా కేవలం 9,689 క్వింటాళ్లు మాత్రమే నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మిగతా ధాన్యం స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ నివేదికను సదరు అధికారులు కలెక్టర్కు నివేదించారు. ఆ నివేదికను తప్పుపడుతూ సదరు రైస్ మిల్లు యజమాని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్, సివిల్ సప్లై, రెవెన్యూ శాఖ అధికారుల మళ్లీ ఎంకర్వీ చేశారు. తొలుత ఇక్కడి రైస్ మిల్లులో తనిఖీలు చేసిన అనంతరం గంగాపురిలోని గోదాంలో ధాన్యం నిల్వలను తనిఖీ చేశారు. విచారణ నివేదికలను కోర్టుకు సమర్చిస్తామని అధికారులు తెలిపారు.