
తరగతి గదుల్లోనే దేశభవిష్యత్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): దేశభవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలిరోజు గురువారం ఎమ్మెల్సీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు జాతీయతభావం, దేవభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణ అలవర్చాలని, అందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశానని గుర్తుచేశారు. డీఈవో మాధవి, ఎంఈవో మహేశ్ కుమార్ మాట్లాడారు. ఉపాధ్యాయుల కృషితో బడిబాట ద్వారా మండలస్థాయిలో మొత్తం 250 మంది విద్యార్థులను ప్రవేశాలు కల్పించామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, స్కూల్ కాంగ్లెక్స్ హెచ్ఎం సునీత, పీఎస్ హెచ్ఎం రాజారాం, మాజీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్రెడ్డి, నాయకులు కావేటి రాజగోపాల్, ఈర్ల శంకర్, చిలువేరు సదాశివ, రఫీ, గరిడె కిషన్, ముల్కోజు వెంకన్న, తిరుపతి, సీను తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ మల్క కొమురయ్య