కాంగ్రెస్‌ నాయకుడిపై దాడి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నాయకుడిపై దాడి

Jun 13 2025 5:09 AM | Updated on Jun 13 2025 5:09 AM

కాంగ్రెస్‌ నాయకుడిపై దాడి

కాంగ్రెస్‌ నాయకుడిపై దాడి

కేసు నమోదు

జమ్మికుంట: కాంగ్రెస్‌ పార్టీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడిపై అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు దాడిచేశాడని టౌన్‌ సీఐ ఎస్‌.రామకృష్ణ గురువారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కొత్తపల్లిలోని కసుబోజుల వెంకన్న ఇంటికి బుధవారం రాత్రి వెళ్లిన దేశిని కోటేశ్వర్‌(కోటి) రాబోయే ఎన్నికల్లో తనకు సపోర్టు చేయాలని బెదిరిస్తూ కర్రతో తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అతని భార్యపై సైతం దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

తిరుపతికి ప్రత్యేక రైలు

● మంత్రి పొన్నం విజ్ఞప్తికి స్పందించిన రైల్వే

కరీంనగర్‌ కార్పొరేషన్‌/ కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ నుంచి తిరుపతికి రైళ్ల సేవలను పెంచుతూ గురువారం రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తికి స్పందించిన రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైలును జూలై 6 నుంచి నడిపించనున్నారు. ప్రతి ఆదివారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్‌ చేరుకుంటుంది. సోమవారం సాయంత్రం 5.30కు కరీంనగర్‌ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8.25కు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు రద్దీని బట్టి రెగ్యులర్‌గా నడిచే అవకాశముంది. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్రమంత్రి బండి సంజయ్‌కి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. ఈ రైలును ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు

జగిత్యాలజోన్‌: ఇంటర్‌ బాలికపై అత్యాచారా నికి యత్నించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.12,200 జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి సి.రత్న పద్మావతి గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణారావు కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంట ర్‌ చదువుతోంది. కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో క్లాస్‌లు వింటోంది. బాలిక ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండగా.. అదే గ్రామానికి చెందిన రెడపాక శ్రీనివాస్‌ ఎప్పుడూ బాలిక ఇంటి వైపు చూ స్తుండేవాడు. 26 జనవరి 2021న బాలిక తల్లి దండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. బా లిక ఇంట్లో బట్టలు మార్చుకుంటోంది. శ్రీని వాస్‌ ఇంట్లోకి వెళ్లి ఆమైపె అత్యాచారం చేయబోయాడు. బాలిక పరుగెత్తుకుంటూ బయటకు వచ్చి తల్లితండ్రులకు ఫోన్‌ ద్వారా తెలి పింది. దీంతో వారు గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై బి.జీవన్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు కిరణ్‌కుమార్‌, శ్రీధర్‌, రాజు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. పరిశీలించిన జడ్జి నిందితుడైన శ్రీనివాస్‌కు మూడేళ్ల జైలు, రూ.12,200 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement