కుక్కల దాడిలో గొర్రెలు మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

Jun 12 2025 3:35 AM | Updated on Jun 12 2025 3:35 AM

కుక్క

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం మల్యాల గ్రామంలో బుధవారం పిచ్చికుక్కల దాడిలో బొట్కు మహేశ యాదవ్‌కు చెందిన 20 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈసంఘటనలో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటినట్లు బాధితుడు మహేశ్‌ బావురుమన్నాడు. గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని కుక్కల బెడద తప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మడేలేశ్వరస్వామి ఆలయంలో చోరీ

15 గ్రాముల బంగారం చోరీ

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని మంచినీళ్ల బావి వద్దగల మడలేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. పూజ అనంతరం అర్చకులు ఆలయానికి తాళం వేసి వెళ్లారు. గుర్తుతెలియని దొంగలు చొరబడి 15 గ్రాముల బంగారం, హుండీలో కొంత నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం అర్చకులు వెళ్లి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్సై మన్మథరావు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఆరోగ్య తెలంగాణ లక్ష్యం

మేడిపల్లి: ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. భీమారం మండలకేంద్రంలో రూ.1.43 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. 97 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 27మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మేడిపల్లి మండలం వల్లంపల్లిలో కాకతీయ కెనాల్‌పై రూ.2.50కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. భీమారం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని, ప్రజల కోరిక మేరకు వారు సూచించిన ప్రదేశంలోనే ఆసుపత్రి నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, చేపూరి నాగరాజు, బద్దం రాజేందర్‌ రెడ్డి, నీరటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

కుక్కల దాడిలో  గొర్రెలు మృతి 1
1/1

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement