గొర్రెలకాపరులకు పరిహారం అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

గొర్రెలకాపరులకు పరిహారం అందిస్తాం

Jun 12 2025 3:35 AM | Updated on Jun 12 2025 3:35 AM

గొర్రెలకాపరులకు పరిహారం అందిస్తాం

గొర్రెలకాపరులకు పరిహారం అందిస్తాం

ధర్మారం(ధర్మపురి): విద్యుత్‌ షాక్‌తో మరణించిన గొర్రెలకు పరిహారం అందిస్తామని, బాధితులు ఆందోళన చెందవద్దని బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. చామనపల్లిలో ఇటీవల విద్యుదాఘాతంతో 52 గొర్రెలు మరణించగా మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ బుధవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి గొర్రెలకాపరులను పరామర్శించారు. అనంతరం స్థానిక మార్కె ట్‌ యార్డులో ప్రమాదవశాత్తు లారీపై నుంచి కిందపడి మరణించిన హమాలీ మెడవేని రాజేశం భార్య రాజేశ్వరికి రూ.5లక్షల పరిహారం చెక్కు అందజేసి మాట్లాడారు. ఇచ్చిన మాటప్రకారం సింగిల్‌విండో ద్వారా రూ.3 లక్షలు, కలెక్టర్‌ ప్రత్యేక నిధి ద్వారా రూ.2లక్షలను బాధిత కుటుంబానికి అందించామ న్నారు. చామనపల్లిలో మృత్యువాతపడ్డ ఒక్కో గొ ర్రెకు రూ.7వేల చొప్పున విద్యుత్‌ శాఖ ద్వారా పరి హారం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ధర్మారం, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్‌పర్సన్లు రూప్లానాయక్‌, ఈర్ల స్వరూప, వైస్‌ చైర్మన్‌ అరిగే లింగయ్య, మేడారం సింగిల్‌విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ సంతోష్‌, డీసీవో శ్రీమాల, డీఎంవో ప్రమీణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొత్త నర్సింహం, మాజీ వైస్‌చైర్మన్‌ కాడే సూర్యనారాయణ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అశోద అజయ్‌, నాయకులు ఓరం చిరంజీవి, ఎండీ అష్ష్యు, ఎల్లయ్య, ఈదుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

గొర్రెల కాపరుల కుటుంబాలకు పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement