భూవివాదంలో ఒకరి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

భూవివాదంలో ఒకరి ఆత్మహత్యాయత్నం

Jun 12 2025 3:33 AM | Updated on Jun 12 2025 3:33 AM

భూవివాదంలో ఒకరి ఆత్మహత్యాయత్నం

భూవివాదంలో ఒకరి ఆత్మహత్యాయత్నం

మెట్‌పల్లిరూరల్‌: తాను కొనుగోలు చేసిన భూమిని ఇతరులకు విక్రయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెట్‌పల్లి మండలం చౌలమద్దిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన వనతడుపుల నాగేశ్వరవరప్రసాద్‌ కొన్నేళ్ల క్రితం చౌలమద్ది శివారులోగల భూమి కొన్నాడు. డబ్బులు చెల్లించినా.. ఆ భూమిని ఓ కుల సంఘం పెద్దమనుషులు తనకు కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయించారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగినా ఇవ్వకపోవడంతో విసుగు చెందిన నాగేశ్వరవరప్రసాద్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద ఓ నోట్‌ లభ్యమైంది. మెట్‌పల్లి సీఐ అనిల్‌, ఎస్సై కిరణ్‌కుమార్‌ బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement