
ఆక్షేపణలు.. ఆరోపణలు
● ముగిసిన అభ్యంతరాల స్వీకరణ ● నేటినుంచి ఐదు రోజులపాటు పరిశీలన, విచారణ ● ఈనెల 21న తుది నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు
21న తుది నోటిఫికేషన్
రామగుండం నగరంలో డివిజన్ల పునర్విభజన ముసాయిదాపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తాం. డివిజన్ల మధ్య 10 శాతం వేరియేషన్ ఉండేలా ఓటర్లను 60 డివిజన్లకు కేటాయిస్తాం. డివిజన్ల హద్దులు, మ్యాపులు సిద్ధం చేసి ఈనెల 17, 18న కలెక్టర్, 19న సీడీఎంఏకు నివేదిస్తాం. ఈనెల 21న తుది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. – అరుణశ్రీ, రామగుండం
బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ)
గందరగోళంగా ఉంది
డివిజన్ల పునర్విభజన గందరగోళంగా ఉంది. పారదర్శత లేదు. హడావుడిగా, తప్పుల తడకగా, మొక్కుబడిగా పునర్విభజన చేశారు. ఓటరు జాబితా పొంతన లేకుండా ఉంది. దళిత సామాజిక రిజర్వేషన్లకు భంగం కలిగిస్తే హైకోర్టును ఆశ్రయిస్తాయిం. మా డివిజన్కు చెందిన ఓటర్లను సంబంధంలేని డివిజన్లో చేర్చారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు, అభివృద్ధికి అనుకూలంగా విభజన చేయాలి.
– మద్దెల దినేశ్, గోదావరిఖని
కోల్సిటీ(రామగుండం): రామగుండం బ ల్దియాలో స్తబ్దుగా ఉన్న రాజకీయం.. డివి జన్ల పునర్విభజనతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈనెల 3న నగరాన్ని 60 డివిజన్లుగా విభజిస్తూ ఈ నెల 4న ముసాయిదా జాబితా వెల్లడించడం ఇందు కు కారణమైంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన అ ధికారులు.. రెండ్రోజులపాటు గదుల్లో కూర్చొని ఓ టర్ల జాబితా ఆధారంగా ముసాయిదా రూపొందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణకు ఇచ్చిన గడువు బుధవారం ముగిసింది. ఈనెల 21న తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తు న్నారు. పునర్విభజన పారదర్శకంగా లేదని ఆరోపణలు వస్తుండగా, డివిజన్ల హద్దులు మరోసారి మా రే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
10 శాతం ఓటర్ల వ్యత్యాసం
బల్దియాను 50 నుంచి 60 డివిజన్లుగా మార్పుచేయ డానికి 10 శాతం ఓటర్ల వ్యత్యాసం ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికనుగుణంగా ఒక్కో డివిజన్లో 2,700 మంది నుంచి 3,300 మంది ఓటర్లుగా ఉండేలా ముసాయిదా తయారు చేశా రు. అభ్యంతరాలపై ఈనెల 16వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తుది జాబితా రూపొందించనున్నారు. మ్యాపులు, హద్దుల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు.. ముసాయిదా జాబితాపై గడువు ముగిసే బుధవారం నాటికి 63 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.
హద్దుల మార్పుతో అయోమయం..
డివిజన్ల పునర్విభజనతో హద్దులు మారడంతో కార్పొరేటర్లుగా పోటీచేయాలనుకుంటున్న వారిలో అయోమయం నెలకొంది. తమకు అనుకూలంగా ఉండే ఓటర్లు, మరో డివిజన్లలోకి మారడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇవీ అభ్యంతరాలు..
● అల్లూరు గ్రామస్తులు ఈనెల 9న బల్దియా కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. శ్రీపాదనగర్ను తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బల్దియాలో విలీనమైన వెంకట్రావుపల్లిని రాజీవ్నగర్లో కలుపకుండా ప్రత్యేక డివిజన్గానే గుర్తించాలని, మారేడుపాకలో వీర్లపల్లి ప్రాంతాన్ని కలపకుండా ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు విన్నవించారు.
● ఎన్టీపీసీ భీమునిపట్నం కాలనీలో కొంతభాగాన్ని నాలుగు, మరికొంత ఐదో డివిజన్లో చేర్చారు. భీమునిపట్నంకాలనీని ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
● గాంధీనగర్, గంగానగర్, శ్రీరాంనగర్, చంద్రబాబుకాలనీ, శారదానగర్, హనుమాన్నగర్లో ఒకేబ్లాక్ ఇంటి నంబర్ల ఆధారంగా డివిజన్లు ఏర్పాటు చేయడంతో నైసర్గిక స్వరూపం మారిపోతోందని, క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ చేయాలని స్థానికులు దరఖాస్తు చేశారు.
● సంజయ్గాంధీనగర్, రాజీవ్నగర్, ఇందిరానగర్లోని ఇళ్లన్నంటినీ ఒకే డివిజన్గా మార్పు చేయాలని విన్నవించారు.
● గతంలో 33వ డివిజన్గా ఉన్న పరుశురామ్నగర్, ఫైవింక్లయిన్ ఏరియాలో 3,200 ఓట్లు ఉండగా, ప్రస్తుతం పరుశురామ్నగర్కు సంబంధంలేని తిలక్నగర్, విఠల్నగర్ ఓట్లను చేర్చి ప్రత్యేక డివిజన్గా మార్చారని, దీనివల్ల దళితుల ఓట్లు చెల్లాచెదురుగా మారి రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన చెందారు.
డివిజన్ల పునర్విభజనపై సమీక్ష
నగరంలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన తీరును వరంగల్ పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ షాహీ ద్ మసూద్ బుధవారం పరిశీలించారు. స్పెషలా ఫీసర్గా వ్యవహరిస్తున్న షాహీద్ మసూద్.. కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీతో భేటీ అయ్యారు. డివిజన్లపై వస్తున్న ఆక్షేపణలు, సలహాలు, సూ చనలపై ఆరా తీశారు. డిప్యూటీ కమిషనర్ వెంక టస్వామి, టౌన్ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో నూ సమావేశమయ్యారు. విభజన పురోగతిపై స మీక్షించారు. మ్యాపులను టీపీవో నవీన్ వివరించారు. పొరపాట్లకు తావివ్వకుండా డివిజన్ల హ ద్దులు నిర్ణయించాలని ఆయన సూచించారు.

ఆక్షేపణలు.. ఆరోపణలు

ఆక్షేపణలు.. ఆరోపణలు