సెలవుకు టాటా | - | Sakshi
Sakshi News home page

సెలవుకు టాటా

Jun 12 2025 3:33 AM | Updated on Jun 12 2025 3:33 AM

సెలవు

సెలవుకు టాటా

● ఇక బడిబాట ● నేటి నుంచి స్కూళ్ల నిర్వహణ ● ముస్తాబైన సర్కారు పాఠశాలలు ● తొలిరోజే పుస్తకాలు, యూనిఫాంలు

సాక్షి, పెద్దపల్లి: ఆటాపాటలతో వేసవి సెలవులు సరదాగా గడిచిపోయాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎగిరి గంతులేసిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. సుమారు నెలన్నరపా టు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది లేక బో సిపోయి కనిపించిన పాఠశాలలు మళ్లీ కళకళలాడనున్నాయి. మరోవైపు.. ఇళ్లనుంచి సంతోషంగా వ చ్చే విద్యార్ధులకు ఘనంగా స్వాగతం పలికేందుకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్వాగత ఏర్పాట్లు చేశా రు. అయితే, చాలాచోట్ల మౌలిక వసతుల లేమి చిన్నారులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మౌలిక వసతుల కల్పనపై అధికార యంత్రాంగం చెప్పిన మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల పథకాల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టినా.. చాలాచోట్ల అసంపూర్తిగానే మిగిలిపోయాయి. సర్కారు స్కూళ్లలో ప్రవేశాలు పెంచేందుకు ప్రభు త్వం ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టి సర్కార్‌ స్కూళ్ల ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులు, విద్యార్థులకు వివరించారు. ఇప్పటివరకు సుమారు 3 వేలకుపైగా కొత్తగా ప్రవేశాలు కల్పించినట్లు అధికారులు వివరించారు.

కొనసాగుతున్న అభివృద్ధి పనులు

గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు–మన బడి పథకం కింద ఎంపిక చేసిన 191 ప్రభుత్వ పాఠశా లల్లో పనులు పడకేశాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన 418 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రూ.23.62కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించగా ఇప్పటివరకు రూ11.84కోట్లతో ప్రగతి పను లు పూర్తిచేశారు. విద్యుత్‌, తాగునీరు, మూత్రశాలలు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించగా, మిగతా పనులన్నీ పురోగతిలో ఉన్నాయి.

పుస్తకాలు, యూనిఫామ్స్‌ పంపిణీకి సిద్ధం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2,22,840 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు సుమారు 2లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకోగా.. మండల కేంద్రాలు.. అక్కడ నుంచి పాఠశాలలకు పంపించారు. మహిళా సంఘాలు జూన్‌ 10లోగా యూనిఫామ్స్‌ను కుట్టి ఉపాధ్యాయులకు అప్పగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 30 వేల యూనిఫామ్స్‌ కుట్టడం పూర్తయింది. పాఠ్య, నోట్‌పుస్తకాలే కాకుండా యూ నిఫామ్స్‌ను కూడా తొలిరోజే విద్యార్థులకు అందించనున్నారు. జిల్లాలో 2,220 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా, 2,195 మంది టీచర్లు పనిచేస్తున్నారు.

జిల్లా సమాచారం

ప్రభుత్వ పాఠశాలలు 545

విద్యార్థుల సంఖ్య(సుమారు) 30,000

కొత్త ప్రవేశాలు 3,000

ప్రైవేట్‌ పాఠశాలలు 174

విద్యార్థుల సంఖ్య(సుమారు) 60,000

మూతపడిన సర్కార్‌ స్కూళ్లు 29

పండుగ వాతావరణం

పాఠశాలలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభిస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నిసౌకర్యా లు కల్పించేలా చర్యలు తీసుకున్నాం. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు, నోట్‌బుక్స్‌లు పాఠశాలలకు చేరవేశాం. బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. అనుమతి లేనిప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు చేరవద్దు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలి.

– మాధవి, డీఈవో

సెలవుకు టాటా 1
1/2

సెలవుకు టాటా

సెలవుకు టాటా 2
2/2

సెలవుకు టాటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement