భూసమస్యల పరిష్కారానికే.. | - | Sakshi
Sakshi News home page

భూసమస్యల పరిష్కారానికే..

Jun 12 2025 3:33 AM | Updated on Jun 12 2025 3:33 AM

భూసమస

భూసమస్యల పరిష్కారానికే..

కమాన్‌పూర్‌(మంథని): భూసమస్యల పరిష్కా రానికే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంథని ఆర్డీవో సురేశ్‌ అన్నారు. రాజాపూర్‌లో బుధవారం నిర్వహించిన రెవె న్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపి భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. తహసీల్దార్‌ వాసంతి, ఆర్‌ఐ స్రవంతి, సీనియర్‌ అసిస్టెంట్‌ సతీశ్‌, జూనియర్‌ అసిస్టెంట్లు శ్రీనివాస్‌, రజి త, కుమార్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు టీకాలు వేయాలి

పెద్దపల్లిరూరల్‌: శిశువులకు రోటాసిల్‌ టీకాలు వేయాలని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. రెండు డోసులు కలిగిన రోటా సి ల్‌ టీకా వాయిల్‌ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆమె ప్రారంభించి మా ట్లాడారు. 6 వారాల వయసుగల శిశువుకు ఓ సపీవీ పెంటా వాలెంట్‌ తొలిడోసుతోపాటు ఇ వ్వాలన్నారు. వైరస్‌ సోకిన పిల్లల్లో తీవ్రనీళ్ల వి రోచనాలు, జ్వరం, వాంతులు, కడుపునొప్పి ఉంటాయని, విరోచనాలు అధికమైతే మృతి చెందవచ్చని, అందుకే రోటాసిల్‌ టీకాలు తప్పనిసరి వేయించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ కిరణ్‌కుమార్‌, స్వాతిభాను, అఖిల ఉన్నారు.

ప్రసవాల సంఖ్య పెంచాలి

మంథని: స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సీ్త్రవైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, మహిళలు, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారి కోరారు. గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్యులు, సిబ్బందితో స్థానిక ఆస్పత్రిలో ఆమె వైద్యసేవలపై సమీక్షించారు. సర్కారు ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు సృజన్‌, మాధురి తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల బస్సుల ఫిట్నెస్‌ రెన్యూవల్‌ చేయించాలి

జ్యోతినగర్‌(రామగుండం): జిల్లాలోని పాఠశాలల బస్సుల ఫిట్నెస్‌ రెన్యూ వల్‌ చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు సూచించారు. ఈ నెల 12న పాఠశాలలు, ఇ తర విద్యాసంస్థలు పునః ప్రారంభం అవుతు న్న నేపథ్యంలో యాజమాన్యులు తమ స్కూల్‌ బస్సులు, ఇతర వాహనాల ఫిట్నెస్‌ (వాహన సామర్థ్య పరీక్ష) రెన్యూవల్‌ చేసుకోవాలని సూచించారు. స్కూల్‌ బస్సులు నిబంధనలు పాటించాలని ఆయన పేర్కొన్నారు.

18న కలెక్టరేట్‌లో జాబ్‌మేళా

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని నిరుద్యోగులకు వీ వీసీ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 18న క లెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహించన్నుట్లు జిల్లా ఉపాధి కల్పనాధిధికారి తిరుపతిరావు బుధవా రం తెలిపారు. రూమ్‌ నంబర్‌–225లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో చేపట్టే మేళాలో 60 ఈవీ సర్వీస్‌ టెక్నీషియన్‌, ఆటోమేటివ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు భర్తీచేస్తారన్నారు. పదో తరగతి, ఐటీఐ/డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని, 18–30ఏళ్ల వయసు లోపు ఉండాలని తెలిపారు. నెల వేతనం రూ. 12 నుంచి రూ.15 వేల మధ్య ఉంటుందని పే ర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 18న ఉద యం 11 గంటల సర్టిఫికెట్‌ జిరాక్స్‌లతో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 77299 92061 నంబరులో సంప్రదించాలని సూచించారు.

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు

పెద్దపల్లిరూరల్‌: హకీంపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కో సం ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేశ్‌ తెలిపా రు. నాలుగో తరగతి చదివే బాల, బాలికలు 1 సెప్టెంబర్‌ 2016 నుంచి 31 ఆగస్టు 2017 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. వీరికి మండల స్థాయిలో ఈనెల 16–19 తేదీలు, జిల్లాస్థాయిలో ఈనెల 23–25వ తేదీల మధ్య ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన విద్యార్థుల కోసం రాష్ట్రస్థా యిలో ఈనెల జూలై 1 నుంచి 5వ తేదీ వరకు హకీంపేటలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్‌ జి రాక్స్‌, బోనోఫైడ్‌ (నాలుగో తరగతి), మూడో తరగతి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, పుట్టిన తేదీ, కులం ధ్రువీకరణ పత్రాలతో tgss.telangana. gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

భూసమస్యల పరిష్కారానికే.. 1
1/2

భూసమస్యల పరిష్కారానికే..

భూసమస్యల పరిష్కారానికే.. 2
2/2

భూసమస్యల పరిష్కారానికే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement