
20న గిరిజన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఈనె ల 20న ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పీఏం జన్మాన్, డీఏజేజీయూఏ పథకాల నిర్వహణపై కలెక్టరేట్లో బుధవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడు తూ, గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఏం జన్మాన్ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్), డీఏజేజీయూఏ(ధరతి ఆభా జనజాతి గ్రా మ ఉత్కర్ష అభియాన్) కార్యక్రమాలను చేపట్టింద న్నారు. గిరిజనులు అధికంగా ఉన్న బట్టుపల్లిని ఇందుకు ఎంపిక చేసుకున్నామని, గ్రామస్తులందరికీ త ప్పనిసరిగా ఆధార్, ఆయుష్మాన్, రేషన్, కిసాన్కా ర్డులతోపాటు కులధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని, అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఇందుకోసం మీసేవ సెంటర్తో సహా మిగతా అన్ని గి రిజన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని, అర్హులతో దరఖాస్తు చేయించాలని సూచించా రు. దివ్యాంగులకు యూడీఐడీ వచ్చేలా చూడాలన్నారు. జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలు తెరవా లని, పీఎం విశ్వకర్మ, ముద్ర, స్టాండప్ ఇండియా వంటి పథకాల ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణాలు మంజూరు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు సూచించారు. పోడు భూముల కు పట్టాలు జారీచేసిన లబ్ధిదారులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి ఇందిరా గిరిసౌర జల వి కాసంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో మంథని ఆర్డీవో సురేశ్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి సంగీత, డీఎఫ్వో శివయ్య, డీహెచ్ఏంవో అన్న ప్రసన్నకుమారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.