
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే విజయరమణారావు
ఓదెల(పెద్దపల్లి): పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మె ల్యే విజయరమణారావు అన్నారు. కనగర్తిలో బు ధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతీ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని అనుసంధానిస్తూ డబుల్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్రెడ్డి, మాజీవై స్ ఎంపీపీ పిట్టల కుమార్, ఎంపీడీవో తిరుపతి, మాజీ ఎంపీటీసీ చొప్పరి రాజయ్య, నాయకులు ఉడిగే సదయ్య, మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
శ్రీరంగనాథుని సన్నిధిలో పూజలు
పెద్దపల్లిరూరల్: బొంపల్లి శ్రీభూగోదా సమేత రంగనాథస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ బ్ర హ్మోత్సవాల సందర్భంగా వేడుకలు నిర్వహించా రు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.