
కార్మికులకు బీమా తప్పనిసరి
జ్యోతినగర్(రామగుండం): ప్రతీ కార్మికుడు బీ మా సౌకర్యం కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం మున్సిపల్ కా ర్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. ఎ న్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో మంగళవారం బీ మా మేళా నిర్వహించారు. దరఖాస్తుదారులకు ఆమె బీమాపత్రాలు అందజేసి మాట్లాడారు. పారిశుధ్య కార్మికులు, ర్యాగ్ పిక్కర్లు, హెల్త్వర్కర్లు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే వారి కుటుంబాలకు బీమాద్వారా పరిహారం అందుతుందన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, రీజినల్ మేనేజర్ రవీందర్సింగ్, ఎస్బీఐ మేనేజర్ నవీన్కుమార్, బల్దియా సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బెస్ట్ అవైలేబుల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని బెస్ట్ అవైలేబుల్ స్కూల్లో మూడు, ఐదు, ఎనిమిదో తరగతు ల్లో ప్రవేశాల కోసం గిరిజన విద్యార్థులు ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మూడో తరగతిలో లంబాడ బాలికలకు ఒకటి, బాలురకు ఒకటి, ఎరుకలలో బాలురకు ఒకటి, ఐదో తరగతిలో గోండు బాలురకు ఒకటి, ఎనిమిదో తరగతిలో లంబాడ బాలికలకు ఒక సీటు కేటాయించామన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం అర్బన్ ప్రాంతంలో రూ.రెండు లక్షలు, రూరల్ ప్రాంతంలో 1.50 లక్షలు ఉండాలన్నారు. కులం, ఆదాయం, పుట్టిన తేదీ, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్ట్సైజ్ ఫొటోలు జతచేసి పూర్తిచేసిన దరఖాస్తులను కరీంనగర్ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈనెల 20న లా టరీ పద్ధతిన అర్హులను ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. వివరాలకు 96521 18867లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
జ్యోతినగర్/యైటింక్లయిన్కాలనీ(రామగుండం): అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే అధిక దిగుబడి సాధ్యమని రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త భాస్కరరావు రైతులకు సూచించారు. మేడిపల్లి, జనగామ, అల్లూరులో సాగుచేస్తున్న పంటలను మంళవారం ఆయన పరిశీలించారు. రై తులు ఏటా ఒకేరకమైన వరి, పత్తికి బదులు స మగ్ర పంటల ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. కూరగాయలు, పూలు, పండ్లు తదితర పంటలను సమయానుకూలంగా సాగు చేస్తే మార్కె ట్ డిమాండ్కు అనుగుణంగా మంచి ఆదా యం వస్తుందని ఆయన వివరించారు. ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం సమకూరుతుందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త వినోద్కుమార్, డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ శాస్త్రవేత్తలు కన్నకి, లక్ష్మణ్ మాట్లాడారు. మండల వ్యవయ అధికారి ప్రకాశ్, ఉద్యాన వన శాఖ అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పంటలకు యూరియా వినియోగం తగ్గించాలి
పెద్దపల్లిరూరల్: రైతులు యూరియా వినియో గం తగ్గించాలని కూనారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ది సూచించారు. వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా రాంపల్లి రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవసరం మేరకే పురుగుమందులు వాడాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు సమయంలోనే రసీదులు తీసుకోవాలని అన్నారు. పంట మార్పిడి పద్ధతి అవలంబిస్తే అధిక ఆదాయం ఉంటుందని తెలిపారు. ఉ ద్యాన వన అధికారి మహేశ్, వ్యవసాయాధికా రి కాంతాల అలివేణి, వ్యవసాయ విస్తీర్ణాధికారి ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు బీమా తప్పనిసరి

కార్మికులకు బీమా తప్పనిసరి