
స్కూల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి
పెద్దపల్లిరూరల్: పాఠశాలల ప రిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా విద్యాశాఖ అధి కారి మాధవి సూచించారు. జి ల్లా కేంద్రంలోని బాలుర జెడ్పీ హైస్కూల్లో మంగళవారం పారిశుధ్య పనుల నిర్వహణపై ఉపాధ్యాయులు, కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీజనల్ వ్యా ధుల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. తరగతి గదులు, టాయిలెట్లు, కారిడార్ మెట్లు, ఆటస్థలాలు, అసెంబ్లీ ప్రాంతాలు, సిబ్బంది గదులు, కార్యాలయ ప్రాంతాలు, నీటి ట్యాంకులు, వాషింగ్ స్టేషన్లను ఎలా శుభ్రపరుచుకోవాలనే ప్రతీ అంశంపై ఒక్కో మండలం నుంచి ఒక ఉపాధ్యాయునికి, ఇద్దరు పారిశుధ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సురేందర్, రిసోర్స్ పర్సన్ దయాకర్, సమన్వయకర్త అజీమ్ దబీర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గురుకుల హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచితేనే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా విద్యాశాఖాధికారి మాధవి అన్నారు. భూపతిపూర్ కాస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఈవో విద్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచడంలో శానిటేషన్ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో కవిత, స్పెషల్ ఆఫీసర్ స్వప్న, డీఆర్పీ సంధ్య, రాణి, రజిత తదితరులు పాల్గొన్నారు.