
సింగరేణి ఆస్పత్రుల్లో మందుల కొరత
గోదావరిఖని: సింగరేణి ఆస్పత్రుల్లో మందులు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నా యని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ అన్నారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన బ్రాంచి కమిటీ స మావేశంలో ఆయన మాట్లాడారు. రోజువారీగా వాడే బీపీ, షుగర్ గోళీలు అందించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు, కార్మికులు ఏటా రూ.వేల కోట్ల లాభాలు ఆర్జించి పెడుతున్నా.. వారి కనీస అవసరాలు తీర్చడంలో నిర్లక్ష్యం చే స్తోందని దుయ్యబట్టారు. కార్మికులు, వారి కు టుంబాల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. కష్టార్జిత సొమ్మును ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న సింగరేణి.. కార్మికు లకు టాబ్లెట్లు అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని నిలదీశారు. రిటైర్డ్ కార్మికులకు నెల నుంచి రెండు నెలలకు సరిపడా మందులు ఇవ్వా ల్సి ఉండగా, 15రోజులకే ఇచ్చి చేతులెత్తేస్తున్నార ని మండిపడ్డారు. మందుల కొరతను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నా యకులు ఎరవల్లి ముత్యంరావు, ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, తోట నరహరిరావు, ఆస రి మహేశ్, సీహెచ్ వేణుగోపాల్రెడ్డి, పి.శ్రీనివాసరావు, నారాయణ, అన్నబోయిన శంకర న్న, శివరాంరెడ్డి, జనార్దన్రెడ్డి, రాజు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్