30 వరకు బియ్యం పంపిణీ | - | Sakshi
Sakshi News home page

30 వరకు బియ్యం పంపిణీ

Jun 10 2025 3:30 AM | Updated on Jun 10 2025 3:30 AM

30 వర

30 వరకు బియ్యం పంపిణీ

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని రేషన్‌ కార్డుదారుల కు రేషన్‌ బియ్యం పంపిణీకి ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించామని అదనపు కలెక్టర్‌ వేణు సోమవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫ రాల శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు రేషన్‌ కార్డుదారులకు జూన్‌లో మూడు నెలలకు సరి పడా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నందున గడువు పొడిగించినట్లు వివరించారు. ల బ్ధిదారులు ఆందోళన చెందకుండా ఈ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అధిక చార్జీలు వసూలు చేయొద్దు

రామగిరి(మంథని): అధిక చార్జీలు వసూలు చే సే మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఈడీఎం కవిత, టీఎస్‌టీఎస్‌ మేనేజర్‌ సాగర్‌ తెలిపారు. సోమవారం స్థానిక మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. వినియోగదారులకు అందుతున్న సేవలపై ఆరాతీశారు. పౌరులకు కనిపించేలా పౌరసేవలు, చార్జీలను ప్రదర్శించాలని సూచించారు.

దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలి

గోదావరిఖని: దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ కోరా రు. స్థానిక యూనియన్‌ కార్యాలయంలో సో మవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల ప రిరక్షణ, నాలుగు లేబర్‌ కోడ్స్‌ రద్దు నిరసిస్తూ కార్మిక, కర్షకులు పాల్గొంటున్నారన్నారు. జూలై 9న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎరవెల్లి ముత్యంరావు, జి.జ్యోతి, వనజారాణి, సీపెల్లి రవీందర్‌, మెండె శ్రీనివాస్‌, అరవింద్‌, దొమ్మేటి కొమురయ్య, నార్వేట్ల నరసన్న, ఆరేపల్లి రాజమౌళి, నాంసాని శంకర్‌, ఈదునూరి రాజేశ్వర్‌, గిట్ల లక్ష్మారెడ్డి, చిప్పకుర్తి చందు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మంచిభోజనం

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని జండర్‌ ఈక్విటీ జిల్లా కో ఆర్టినేటర్‌ కవిత సూచించా రు. భూపతిపూర్‌ కేజీబీవీని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటల తయారీ శిక్షణపై పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు రుచికరమైన వంటల తయారీపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. స్పెషల్‌ ఆఫీసర్‌ స్వప్న తదితరులు ఉన్నారు.

అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

గోదావరిఖనిటౌన్‌: గోదావరిఖని నుంచి అరుణాచలానికి రాజధాని బస్సును కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.సోలమాన్‌, రీజిన ల్‌ మేనేజర్‌ రాజు సోమవారం ప్రారంభించా రు. బస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. టీ–20 సభ్యులకు సూచనలిచ్చారు. డీఎం నాగభూషణం, అసిస్టెంట్‌ మేనేజర్‌(ట్రాఫిక్‌) కె.గీతాకృష్ణ, బస్‌స్టేషన్‌ మేనేజర్‌ జి.అమృత, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ శంకరయ్య పాల్గొన్నారు.

సేవలకు గుర్తింపు

మంథని: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా దుద్దిళ్ల శ్రీనివాస్‌(శ్రీ నుబాబు) నియామకమయ్యారు. కాంగ్రెస్‌లో ఆ యన కొన్నేళ్లుగా క్రియాశీ లంగా పనిచేస్తున్నారు. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సోద రుడు శ్రీనుబాబు.. అన్నకు వెన్నంటి ఉంటూ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. యూత్‌ నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు. నిత్యం వందలాది వివాహాలు, పరామర్శలతోపాటు అనేక సేవా కార్యక్రమాల్లో శ్రీనివాస్‌ ఉత్సహంగా పాల్గొంటున్నారు. అన్నకు తగ్గ తమ్ముడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. మంథనితో పాటు ఇతర నియోజకవర్గాల్లో సైతం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతలో ఉత్సాహం నింపుతున్నారు.

30 వరకు బియ్యం పంపిణీ 1
1/4

30 వరకు బియ్యం పంపిణీ

30 వరకు బియ్యం పంపిణీ 2
2/4

30 వరకు బియ్యం పంపిణీ

30 వరకు బియ్యం పంపిణీ 3
3/4

30 వరకు బియ్యం పంపిణీ

30 వరకు బియ్యం పంపిణీ 4
4/4

30 వరకు బియ్యం పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement