రవాణా మరింత మెరుగు | - | Sakshi
Sakshi News home page

రవాణా మరింత మెరుగు

Jun 10 2025 3:30 AM | Updated on Jun 10 2025 3:30 AM

రవాణా మరింత మెరుగు

రవాణా మరింత మెరుగు

● ఎమ్మెల్యే విజయరమణారావు

ఓదెల(పెద్దపల్లి): డబుల్‌ రోడ్ల నిర్మాణంతో ప్ర యాణ సౌకర్యం మరింత మెరుగుడుతుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఓదెల – పెగడపల్లి మధ్య చేపట్టిన డబుల్‌ రోడ్డు నిర్మాణా న్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసి, పట్టాల పంపిణీ చే శారు. పిట్టలఎల్లయ్యపల్లెలో రేషన్‌షాపు ప్రారంభించి మాట్లాడారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నిర్మించే డబుల్‌ రోడ్ల నిర్మాణంతో పల్లెలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయన్నారు. ఇప్పటికే పొత్కపల్లి – కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల టెంపుల్‌ – కొమిర మధ్య చేపట్టిన బీటీరో డ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కార్యక్ర మంలో పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ ఆళ్ల సు మన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, నాయకులు అంబాల కొముర య్య, పిట్టల రవికుమార్‌, చీకట్ల మొండయ్య, బొడకుంట చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, మడకలో గొర్రెల యాజమాని వేల్పుల రా జకొమురయ్యకు ఎమ్మెల్యే విజయరమణారావు చెక్కు అందజేశారు. విద్యుత్‌షాప్‌తో ఇటీవల గొ ర్రెలు మృతి చెందగా రూ.1.75లక్షలు మంజూరయ్యాయి. ట్రాన్స్‌కో ఎస్‌ఈ మాధవరావు, ఏడీఏ మధుకర్‌, ఏఈఈ రాంమోహన్‌ పాల్గొన్నారు.

13న ఎలిగేడు ఠాణా ప్రారంభం

ఎలిగేడు(పెద్దపల్లి): మాట ప్రకారం ఎలిగేడులో పోలీసుస్టేషన్‌ను ఈనెల 13న ప్రారంభిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డితో కలిసి ఆయన ఠాణా భ వనం పరిశీలించారు. దీనితోపాటు పెద్దపల్లి రూ రల్‌, ట్రాపిక్‌, మహిళా పోలీసుస్టేషన్లు సైతం ప్రా రంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నాయకు లు సామ రాజేశ్వర్‌రెడ్డి, దుగ్యాల సంతోష్‌రావు, వెంకటేశ్వర్‌రావు, వెంకటసత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement