
రామగుండం బల్దియాకు కొత్త వాహనం
కోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియాకు జేసీబీ కంపెనీకి చెందిన మినీ ట్రక్ ఎక్స్కావేటర్ వాహనం సో మవారం వచ్చిచేరింది. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.30లక్షలు వెచ్చించి ఈ వాహనం కొనుగోలు చేశారు. బ ల్దియా ఆవరణలో పార్క్చేసిన వాహనాన్ని ఈఈ రామన్ తనిఖీ చేశారు. దా ని పనితీరు, నాణ్యత, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు. దీనిద్వారా చిన్న, పెద్దనాలాల్లోని పూడిక తొలగించడంతోపాటు గల్లీల్లోనూ వివిధ పనులు చేపట్టడానికి ఉపయోగిస్తామని ఈఈ తెలిపారు. డీఈ శాంతిస్వరూప్, ఏఈ అన్వేష్, కాంట్రాక్టర్ మేరుగు రాజేశ్, జేసీబీ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.
న్యాయవాదులకు శిక్షణ
పెద్దపల్లిరూరల్: ఎస్సీ న్యాయవాదుల కు ప్రభుత్వ న్యాయవాదితో శిక్షణ ఇ ప్పిస్తామని ఎస్సీ అభివృద్ధి అధికారి వి నోద్కుమార్ తెలిపారు. ఆసక్తి, అర్హత గలవారు జూలై 31వ తేదీలోగా దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షల మించి ఉండకూడదన్నారు. వివరాల ను www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో నమోదు చేయాలని ఆయన సూచించారు.
దివ్యాంగులకు ఆధునిక ఉపకరణాలు పంపిణీ
పెద్దపల్లిరూరల్: ఉపకరణాల కోసం దివ్యాంగులు ఈనెల 18వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకో వాలని జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్ సోమవారం తెలిపారు. వందశా తం రాయితీపై ఆధునిక ఉపకరణాలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.. ఆసక్తిగల వారి కోసం https://tsobmms. cgg. gov.in// వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోందని ఆయన పేర్కొన్నా రు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.