
పింఛన్తోనే బతకాలట
మాకు ఇద్దరు కొడుకులు ఉన్నరు. మా కష్టార్జితం ఆరెకరాల్లో చెరో రెండెకరాలను 16ఏళ్ల క్రితమే పంచి ఇచ్చినం. మిగిలింది మా పేరు మీద ఉంది. దానిని సైతం వారిద్దురూ దున్నుకుంటున్నరు. కనీసం కౌలు ఇవ్వడం లేదు. తిండి పెట్టడం లేదు. పింఛన్ మీదనే బతుకు అని అంటున్నరు. మీరే న్యాయం చేయాలి.
– గాండ్ల సాయిలు, లలిత అబ్బాపూర్, జూలపల్లి
అర్హులకు చెందేలా చూడాలి
మా ఊరిలోని సర్వే నంబర్ 437లో సుమారు 50 ఎకరాలు ఉంది. మాదిగ సామాజికవర్గానికి చెందిన మే ము.. 70 కుటుంబాల వాళ్లం కలిసి ఉపాధికోసం అందులో సాగు చేసుకుంటున్నం. కొందరు ఇటీవల దౌర్జన్యంగా ఆ భూముల్లోకి చొరబడ్డరు. అది మా భూమి అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నరు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి అర్హులకు న్యాయం చేయాలె.
– ఆరేపల్లి కృష్ణకుమార్, ఆరెంద, మంథని

పింఛన్తోనే బతకాలట