
బల్దియాలో రక్తదాన శిబిరం
కోల్సిటీ(రామగుండం): వందరోజుల ప్రణాళికలో భాగంగా బల్దియాలో జీజీహెచ్ బ్లడ్ క్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 30 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ శంకర్రావుతోపాటు చంద్రారెడ్డి, శంకర్స్వామి, సాయిరాం, రాజ్కుమార్, రవితేజ, శ్రీపాల్, కిరణ్, యుగాంత్, శ్రావణ్, మధూకర్, శ్రీకాంత్, కోటయ్య, సత్యనారాయణ, గంగరాజు, విశ్వతేజ, మెరుగు రాజేశ్, కేఎస్ వాసు పాల్గొన్నారు. రక్తదాతలకు బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ అభినందించారు.