అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

Jun 9 2025 12:06 AM | Updated on Jun 9 2025 12:06 AM

అంబేడ

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

పాలకుర్తి(రామగుండం): అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఈసాలతక్కళ్లపల్లిలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ వి గ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించి మా ట్లాడారు. మక్కాన్‌సింగ్‌ సేవాసమితి అధ్యక్షురాలు మనాలీ ఠాకూర్‌, అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాప య్య తదితరులు పాల్గొన్నారు.

‘ఖని’లో చేప ప్రసాదం పంపిణీ

గోదావరిఖనిటౌన్‌: మృగశిర కార్తె సందర్భంగా ఆయుర్వేద డాక్టర్‌ పరశురాములు తనయు డు కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్ర ధాన చౌరస్తాలో చేప ప్రసాదం పంపిణీ చేశా రు. సుమారు 40 ఏళ్లుగా ఏటా మృగశిర సందర్భంగా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నామని కుమార్‌ తెలిపారు. 101 వనమూలికలతో త యారు చేసే చేపప్రసాదంతో ఆస్తమా, గుండెజబ్బులు వంటి వ్యాధులు నియంత్రణలోకి వస్తాయని డాక్టర్‌ కుమార్‌ పేర్కొన్నారు.

నేడు, రేపు రెవెన్యూ సదస్సులు

పెద్దపల్లిరూరల్‌: చందపల్లి, బంధంపల్లి గ్రామా ల రైతుల కోసం సోమ, మంగళవారాల్లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామ ని అధికారులు తెలిపారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సదస్సులో అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు సమస్యలపై ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

30లోగా దరఖాస్తు చేయాలి

పెద్దపల్లిరూరల్‌: సీఎం ఓవర్సీస్‌ పథకం కింద స్కాలర్‌షిప్‌, ఆర్థిక సాయం కోసం ఈనెల 30 వ తేదీలోగా మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధి కారి రంగారెడ్డి తెలిపారు. విదేశీ యూనివర్సిటీ ల్లో చదువుకునేందుకు ఇంజనీరింగ్‌లో 60 శా తం, పీజీలో 60 శాతం మార్కులు సాధించి, కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలన్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కె నడా, సింగపూర్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, న్యూజీలాండ్‌, దక్షిణ కొరియా దేశాల్లోని యూ నివర్సిటీల్లో ప్రవేశం పొంది ఉండాలని, వివరాలకు వెబ్‌సైట్‌ www.telanganaepass. cgg.gov.inలో సంప్రదించాలన్నారు.

ప్రవేశాల ప్రక్రియ పరిశీలన

యైటింక్లయిన్‌కాలనీ: సెక్టార్‌–3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్‌ఈ పద్ధతిన ఈ విద్యా సంవ త్సరం నుంచే విద్యాబోధన చేస్తున్నారు. ఇందు లో ప్రవేశాల కోసం చేపట్టిన స్క్రినింగ్‌ టెస్ట్‌ ప్ర క్రియను సింగరేణి ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్‌ ఆదివారం పరిశీలించారు. ప్రవేశాల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నా రు. ప్రతిభ ఆధారంగానే సింగరేణి కార్మికుల పి ల్లలకు 80శాతం, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈనెల 12న సీబీఎస్‌ఈ విద్యాబోధన ప్రారంభిస్తా మని అన్నారు. హెచ్‌ఎం సుందర్‌రావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఓదెల మల్లన్నకు నైవేద్యం

ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలు వేయించి, బోనంతో నైవేద్యం సమర్పించారు. ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

రెవెన్యూ మేళాకు స్పందన

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియాలో ఆదివారం రెవెన్యూ మేళా నిర్వహించారు. తమ నివాసం కమర్షియల్‌ కేటగిరీలోకి చేర్చినందున ఆస్తిపన్ను అధికంగా వస్తుందని కొందరు, కొలతలు సవరించి ఆస్తిపన్ను తగ్గించాలని, పేర్లలో అక్షరదోషాలు సరిచేయాలని మరికొందరు దరఖాస్తు చేశారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి1
1/3

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి2
2/3

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి3
3/3

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement