ధాన్యం కొనుగోళ్లలో రికార్డు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో రికార్డు

Jun 9 2025 12:06 AM | Updated on Jun 9 2025 12:06 AM

ధాన్య

ధాన్యం కొనుగోళ్లలో రికార్డు

● 4.26 లక్షల క్వింటాళ్ల వడ్లు సేకరణ ● మంథని పీఏసీఎస్‌ జిల్లాలోనే అగ్రస్థానం

మంథని: ధాన్యం కొనుగోళ్లలో మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జిల్లాలోనే రికార్డ్‌ సృష్టించింది. అత్యధికంగా వడ్లు కొనుగోలు చేసి గత రికార్డులు బ్రేక్‌ చేసింది. జిల్లాలోనే మంథని పీఏసీఎస్‌ అధికం సంఖ్యలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఐదేళ్లలో అత్యధిక స్థాయి లో ధాన్యం కొనుగోళ్లు చేస్తూ వస్తోంది. ఈసారి ఏకంగా 4లక్షల 26వేల 860 క్వింటాళ్ల ధాన్యం సేకరించి సరికొత్త రికార్డు సృష్టించింది.

35 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి..

● ఈయాసంగి సీజన్‌లో మంథని సంఘం పరిధి లోని 35 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసింది.

● 2021 యాసంగి సీజన్‌లో 32 కేంద్రాలు నిర్వహించి 4,414 మంది రైతుల నుంచి 64వేల031 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.68 కోట్ల 70 లక్షల70వేల612 వ్యాపారం చేసింది.

● 2021–22 వానాకాలం సీజన్‌లో 32 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4,844 మంది రైతుల నుంచి 3లక్షల 19వేల879 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ. 62కోట్ల 31లక్షల 95వేల 424 వ్యాపారం చేసింది.

● యాసంగి సీజన్‌లో 32 కొనుగోలు కేంద్రాలు నిర్వహించి 2,649 మంది రైతుల నుంచి 1 లక్ష 79వేల476 క్వింటాళ్ల వడ్లు సేకరించి రూ.35కోట్ల 17లక్షల 40వేల 816 వ్యాపారం చేసింది.

● 2022–23 వానాకాలం సీజన్‌లో 34 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,009 మంది రైతుల నుంచి 3లక్షల 48వేల 044 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.71కోట్ల 34లక్షల 11వేల 740 వ్యాపారం చేసింది.

● 2023 యాసంగి సీజన్‌లో 33 కేంద్రాలు నిర్వహించి 3,820 మంది రైతుల నుంచి 3లక్షల 63వేల 360 క్వింటాళ్ల వడ్లు సేకరించి రూ.74కోట్ల 28లక్షల 80వేల 560 వ్యాపారం నిర్వహించింది.

● 2023–24 వానాకాలం సీజన్‌లో 33 కేంద్రాల ద్వారా 3,117 మంది రైతుల నుంచి 2లక్షల 28వేల 932 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.46కోట్ల 97లక్షల 17వేల 232 వ్యాపారం చేసింది.

● 2024 యాసంగి సీజన్‌లో 37 కేంద్రాలు నిర్వహించి 5,109 మంది రైతుల నుంచి 3లక్షల 68వేల 248 క్వింటాళ్ల వడ్లు సేకరించి రూ.75కోట్ల 40లక్షల 55వేల 408 వ్యాపారం చేసింది.

● 2024–25 వానాకాలం సీజన్‌లో 35 కేంద్రాలు నిర్వహించి 5,216 మంది రైతుల నుంచి 3లక్షల 69వేల 823 క్వింటాళ్లు సేకరించి రూ.85కోట్ల 13లక్షల 19వేల 511 వ్యాపారం చేసింది.

● 2025 యాసంగిలో 35 కేంద్రాలు నిర్వహించి 5,148 మంది రైతుల నుంచి 4లక్షల 26వేల 860 క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.98కోట్ల 46లక్షల 11వేల 472 వ్యాపారం చేసింది.

అందరి సహకారంతోనే..

జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ అందరి సహకారంతోనే సాధ్యమైంది. విజయవంతంగా కొనుగోళ్లు చేసేలా సహకరించిన ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు అధికారులకు కృతజ్ఞతలు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాం. మంత్రి ప్రత్యేక చొరవతో రైతుల నుంచి గింజ కూడా కోత విధించలేదు.

– కొత్త శ్రీనివాస్‌, చైర్మన్‌, మంథని పీఏసీఎస్‌

ధాన్యం కొనుగోళ్లలో రికార్డు1
1/1

ధాన్యం కొనుగోళ్లలో రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement