
జనం ఎక్కడుంటే.. ప్రచారం అక్కడే..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వైద్యశిబిరం.. రేష న్ షాపు.. ఆర్టీసీ బస్టాండ్.. ప్రధాన కూడళ్లు.. ఉ పాధిహామీ కూలీల పని ప్రదేశాలు.. చెట్లనీడ.. ఇ లా ప్రజల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను ప్ర చార వేదికలుగా చేసుకుంటున్న ఎంఈవో సిరిమ ల్ల మహేశ్కుమార్.. సర్కార్ స్కూల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆధునిక హంగులు, సకల సౌకర్యాలు, డి జిటల్ విద్యాబోధన, బంధాలు, బంధుత్వాలు, ఆడుతూపాడుతూ.. అమ్మమ్మ.. బామ్మ.. తాతయ్యలు చెప్పే కథలు, జోలపాటలు వింటూ ఉన్న ఊళ్లోనే సర్కారు బడిలో పిల్లలకు చదువు నేర్పించాలని కోరుతున్నారు. ఈక్రమంలోనే ఆదివారం ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన వైద్య శిబిరం వద్ద ఎంఈవో బడిబాట నిర్వహించారు. తమ స ర్కారు బడిలోనే పిల్లలను చేర్పించాలని కోరారు. హెచ్ఎం రాజారాం, ఉపాధ్యాయులు ఉన్నారు.