
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి
● ముందస్తు సాగు పద్ధతులు పాటించాలి ● విత్తన కొనుగోలు సమయంలో రసీదు పొందాలి ● మట్టి నమూనాలు ఇస్తే భూసార పరీక్షలు చేయిస్తాం ● పచ్చిరొట్ట విత్తనాలతోనూ భూసారం పెంపు ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి
పెద్దపల్లిరూరల్: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమని, ఈ వానాకాలంలో సన్న, దొడ్డురకం వరి రకాల సాగుకు సకాలంలో సమాయత్తం కావాలని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి కోరారు. ఆడ, మగ విత్తనాలు అందించిన ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు దళారీలతో కలిసి మోసం చేస్తున్నారనే ఆరోపణలపై డీఏవో స్పందించారు. భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలు అందిస్తే పరీక్షించి ఫలితాలు ఇస్తామన్నారు. శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమం ద్వారా రైతులు వెలిబుచ్చిన అనేక సందేహాలకు డీఏవో ఆదిరెడ్డి సమాధానాలు ఇచ్చారు.

నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి