ఆయిల్‌పామ్‌ సాగు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగు చేయండి

Jun 7 2025 12:05 AM | Updated on Jun 7 2025 12:05 AM

ఆయిల్‌పామ్‌ సాగు చేయండి

ఆయిల్‌పామ్‌ సాగు చేయండి

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కోరారు. పెగడపల్లిలో పత్తి శ్రీనివాస్‌రెడ్డి సాగుచేసి న ఆయిల్‌పామ్‌ తోటలో గెలల సేకరణ కార్యక్రమా న్ని కలెక్టర్‌ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించా రు. ఆయిల్‌పామ్‌ సాగుతో ఖర్చు తక్కువ ఉండి ఆ దాయం అధికంగా వస్తుందన్నారు. పంట సాగుచేశాక మూడేళ్ల వరకు అంతర్‌ పంటలు పండించొచ్చని, నాలుగో ఏడాది నుంచి దిగుబడి వస్తుందని ఉ ద్యానవన జిల్లా అధికారి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపా రు. కోతులు, ఎలుకల బెడద ఉండదని, రాళ్లవానకూ కాయలు రాలవని హార్టికల్చర్‌ అధికారి మహే శ్‌ అన్నారు. జిల్లాలో సుమారు 3వేల ఎకరాల్లో ఆ యిల్‌పామ్‌ సాగవుతోందని సీఈవో కల్యాణ్‌ కర్‌ తెలిపారు. తహసీల్దార్‌ జగదీశ్వర్‌రావు, ఏఎంసీ చై ర్మన్‌ తిరుపతిరెడ్డి, సారయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికే..

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే భూ భారతి చట్టం అమలు చేస్తున్నామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. పెగడపల్లిలో చేపట్టిన భూ భారతి రెవె న్యూ సదస్సును ఆయన సందర్శించి రైతుల దరఖాస్తులను పరిశీలించారు. తహసీల్దార్‌తోపాటు డిప్యూటీ తహసీల్దార్‌ శంకర్‌ పాల్గొన్నారు.

మూలసాల గ్రామంలో..

పెద్దపల్లిరూరల్‌: మూలసాలలో నిర్వహించిన రె వెన్యూ సదస్సుకు కలెక్టర్‌ హాజరై ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరిపి పరిష్కారం చూపాలని ఆదేశించారు. తహసీ ల్దార్‌ రాజయ్య, ఆర్‌ఐ రాజిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement