
రేషన్డీలర్పై చర్యలు తీసుకోవాలి
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ 15వ డివిజన్లోని రేషన్ డీలర్ తూకంలో మోసం చేస్తున్నాడని, డీలర్పై చర్యలు తీసుకోవాలని గురువారం లబ్ధిదారులతో కలిసి మాజీ కార్పొరేటర్ శంకర్నాయక్ షాప్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం ఆరు కిలోలకు నాలుగైదు కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నట్లు లబ్ధిదారులు శంకర్నాయక్కు తెలపడంతో వెంటనే షాప్ వద్దకు చేరుకొని పరిశీలించారు. ఈవిషయమై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.