
రేషన్.. పరేషాన్
సుల్తానాబాద్(పెద్దపల్లి): వర్షాకాలంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి.. ఈనెలలోనే పంపిణీ చేస్తున్నాయి. అయితే, వేలిముద్రలు సరిపోక, ఒకటికి మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యమవుతోంది. తద్వారా ఈనె కోటాలో బుధవారం వరకు 10 శాతం లబ్ధిదారులకు కూడా రేషన్ బియ్యం పంపిణీ చేయలేకపోయామని డీలర్లు వాపోయారు.
ఎండ తీవ్రత.. బియ్యం కోసం ఆత్రుత
ప్రస్తుతం ఎండతీవ్రత అధికంగా ఉంది. దీంతో కార్డుదారులు ఉదయమే రేషన్ షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. అయితే, ఉదయం 9 గంటలు – ఉదయం 10 గంటల మధ్యే ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుండడంతో క్యూలో నిల్చోలేక చాలామంది చెప్పులు, సంచులు క్యూలో పెడుతూ, వారు చెట్లు, రేకుల నీడన నిరీక్షిస్తున్నారు.
బియ్యం పంపిణీలో తీవ్రజాప్యం
సాంకేతిక సమస్యలే కారణం