సర్కారు పాఠశాలలను కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

సర్కారు పాఠశాలలను కాపాడుకుందాం

Jun 5 2025 7:44 AM | Updated on Jun 5 2025 7:44 AM

సర్కారు పాఠశాలలను కాపాడుకుందాం

సర్కారు పాఠశాలలను కాపాడుకుందాం

పెద్దపల్లిరూరల్‌: సర్కారు స్కూళ్లలో విద్యార్థు ల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు స్థానికు ల సహకారంతో ముందుకు సాగాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి కోరారు. టెన్త్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి న విద్యార్థులు, నూరు శాతం ఫలితాలు సా ధించిన హెచ్‌ఎంలకు పీఆర్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం అవార్డులు అందజేశారు. డీఈవో మాధవి హాజరయ్యా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులనే అంబాసిడర్లుగా చూపించి ప్రవేశాలు కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయన్నారు. సంఘం నాయకులు లక్ష్మణ్‌, కర్రు సురేశ్‌, దామోదర్‌రెడ్డి, హన్మంతు, హెచ్‌ఎంలు కృష్ణమూర్తి, కరుణాకర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, శంకర్‌, మోహన్‌రావు, రవినందన్‌రావు, శ్రీధర్‌రావు, రాజమౌళి, శ్రీనివాస్‌, పోచయ్య, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement