
ప్రభుత్వ కాలేజీలో చేర్పించాలి
జూలపల్లి(పెద్దపల్లి): అర్హులైన అధ్యాపకులతో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వ కళాశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని అధ్యాపకులు పవన్కుమార్, మహేందర్ కోరారు. స్థానిక ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు పదో తరగతి పాసైన విద్యార్థులను బుధవారం నేరుగా కలుసుకున్నారు. ప్రభుత్వ కళాశాలలో బోధిస్తున్న విద్యావిధానంపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు సురేశ్ కుమార్, విజేందర్, రవిచంద్రన్, శ్రీనివాస్, అజయ్య తదితరులు పాల్గొన్నారు.