
అభివృద్ధి పనులకు భూసేకరణ
మంథని: అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. అంగుళూరు శివారులో రోడ్లు, భవనాల శాఖ చేపట్టే శ్రీపాద మార్గ్, బైపాస్ రోడ్డు, ఇండస్ట్రియల్ పార్క్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుకూలమైన భూములను ఆయన మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మా ట్లాడుతూ, శ్రీపాద మార్గ్, బైపాస్ రోడ్డు నిర్మాణాని కి అనువైన భూ సేకరణకు వెంటనే మార్కింగ్ చే యాలని, దీనిద్వారా రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తారన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న 70 ఎకరాల సేకర ణకు ఎంజాయ్ంట్ సర్వే ప్రారంభించాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని సర్వేయర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణ
రామగిరి(మంథని): ప్రైవేట్ సర్వేయర్లకు లైసెన్స్ జారీచేసేందుకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సెంటినరీకాలనీలోని మంథ ని జేఎన్టీయూలో చేపట్టిన సర్వేయర్ల శిక్షణ శిబిరా న్ని ఆయన తనిఖీ చేశారు. భూ భారతి చట్టం ప్రకా రం భూ క్రయ, విక్రయాలు, మ్యుటేషన్ కోసం మ్యాప్ జతచేయాలని అన్నారు. జిల్లాలోని రెండు బ్యాచ్ల్లో 112 మంది ప్రైవేట్ సర్వేయర్లకు భూభా రతి చట్టం, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ మే 26 నుంచి జూలై 26వ తేదీ వరకు సుదీర్ఘంగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ శ్రీనివాసులు, డిప్యూటీ ఐవోఎస్ గణపతి, రఘుపతి, అనిల్ పాల్గొన్నారు.