
రేషన్.. పరేషాన్
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. దీంతో చౌకధరల దుకాణాల ఎదుట కార్డుదారులు బారులుతీరుతున్నారు. కొన్ని దుకాణాల్లో స్టాక్ కోసం నిరీక్షిస్తుంటే.. మరికొన్నింటి వద్ద సందడి నెలకొంది. బయోమెట్రిక్ మూడుసార్లు వేస్తుండడం, ఆన్లైన్ నమోదు ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో కార్డుదారు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం భూంనగర్లోని రేషన్ దుకాణం వద్ద బారులు తీరి ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు రేషన్ కార్డుదారులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

రేషన్.. పరేషాన్