
పోలీసులంటే గౌరవం ఉండాలి
హుజూరాబాద్: ప్రజలకు పోలీసులంటే గౌరవం ఉండాలే తప్ప భయం కాదని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఇన్చార్జి తిప్పారపు సంపత్ అన్నారు. ఇటీవల ఎస్సై భార్గవ్ దళిత యువకుడు మహేందర్ను తీవ్రంగా కొట్టిన వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సై భార్గవ్ ప్రవర్తన ఒక నియంతలా ఉందన్నారు. దళితుడిని అసభ్య పదజాలతో దూషిస్తూ కొట్టడం ఏంటన్నారు. ఈ ఘటనపై పలుసార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, రవి కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సైక్లింగ్తో ఆరోగ్యవంతమైన సమాజం
మల్లాపూర్(కోరుట్ల): రోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సైక్లింగ్ క్లబ్ ఫౌండర్ వాల్గొట్ కిషన్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి సైక్లింగ్తో మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చేరుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైక్లింగ్తో షుగర్, రక్తపోటు, ఊబకాయాన్ని నివారించవచ్చన్నారు. ‘సైకిల్ తొక్కండి.. ఆరోగ్యంగా ఉండండి’ అనే నినాదంతో ప్రజలందరూ నిత్యం సైక్లింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో గోల్కోండ రమేశ్, ఏలేటి ప్రీతంరెడ్డి, గంధం రఘు తదితరులు పాల్గొన్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
హుజూరాబాద్: హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో కరీంనగర్ – వరంగల్ రహదారిపై మంగళవారం ఆయిల్ ట్యాంకర్ ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ట్రాలీ బోల్తాపడడంతో రోడ్డుపై సిలిండర్లు చెల్లాచెదురగా పడిపోయాయి. కాగా కొన్ని సిలిండర్ల నుంచి గ్యాస్ లీకై ంది. అయినా అవి పేలకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కాగా ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులంటే గౌరవం ఉండాలి

పోలీసులంటే గౌరవం ఉండాలి