
పోటెత్తిన భక్తులు
మల్యాల(చొప్పదండి): కొండగట్టు అంజన్న సన్నిధికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీకాంత్రావు, అశోక్, సుధాకర్రెడ్డి, రవి, రాములు చర్యలు చేపట్టారు. వేలాదిమంది తరలిరావడంతో కోనేటి నీరు మురికిగా మారగా, భక్తులు షవర్ల వద్ద స్నానమాచరించారు. ప్రతీ శని, మంగళవారాలు కోనేటిలోకి నీరు నిరంతరాయంగా విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.

పోటెత్తిన భక్తులు