కాలగర్భంలో రామగుండం బీ–థర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

కాలగర్భంలో రామగుండం బీ–థర్మల్‌

Jun 4 2025 12:31 AM | Updated on Jun 4 2025 12:31 AM

కాలగర్భంలో రామగుండం బీ–థర్మల్‌

కాలగర్భంలో రామగుండం బీ–థర్మల్‌

రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యంగల రామగుండం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఆర్‌టీఎస్‌–బీ) కాలగర్భంలో కలిసి పోయి బుధవరాం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలివిద్యుత్‌ కేంద్రంగా పేరు గాంచిన ఆర్‌టీపీఎస్‌.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెలుగులు పంచింది. ఈక్రమంలోనే విద్యుత్‌ ఉత్పత్తి, పీఎల్‌ఎఫ్‌లో అనేక సరికొత్త రికార్డులు నెలకొల్పింది. స్థానికంగా బొగ్గు, నీరు, రవాణా వ్యవస్థకు అనువైన పరిస్థితులు ఉండడంతో రామగుండం ప్రాంతం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు నిలయంగా మారింది. దీంతో దేశంలోనే ఆధునిక విద్యుత్‌ కేంద్రాలతో పోటీ పడుతూ, అతి తక్కువ ధరకే విద్యుత్‌ ఉత్పత్తి చేసిన ఘనత బి–థర్మల్‌ కేంద్రానికే దక్కింది. రూ.14.8 కోట్ల వ్యయంతో 1965 జూలై 19న విద్యుత్‌ కేంద్రం స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డిసెంబర్‌ 10, 2007 నుంచి నిరాటకంగా 159 రోజులపాటు విద్యుత్‌ ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. దానిని తిరగరాస్తూ 20 ఫిబ్రవరి 2017 తర్వాత ఒకరోజు ఎక్కువగా 160 రోజులు సాధించి రికార్డులు బద్ధలు కొట్టింది. 159 రోజుల్లో 92.64 పీఎల్‌ఎఫ్‌తో 221.74 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సైతం ఆధునిక విద్యుత్‌ కేంద్రాలతో పోటీపడుతూ ఉత్పత్తి, పీఎల్‌ఎఫ్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించింది.

విద్యుత్‌ కేంద్రం మూతపడి నేటితో ఏడాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement