
ఆకట్టుకుంటున్న వాల్ ఆర్ట్స్
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగర ప్రజల దృష్టిని ఆకర్శించేలా అధికారులు వాల్ ఆర్ట్స్ ప్రాజెక్ట్ చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.40 లక్షలు వెచ్చించి ఈ పనులు చేపట్టారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ టెండరు దక్కించుకుని వాల్ ఆర్ట్ ప్రారంభించింది. తొలుత రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం గోడలపై ఆకట్టుకునేలా రంగులతో బొమ్మలు చిత్రీకరిస్తున్నారు. నగర అందం, ప్రత్యేక శోభను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, పార్క్ల ప్రహరీలపై రంగుల చిత్రాలను వేయిస్తున్నట్లు కమిషనర్ అరుణశ్రీ తెలిపారు.