పాతభవనం కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

పాతభవనం కూల్చివేత

May 25 2025 10:59 AM | Updated on May 25 2025 10:59 AM

పాతభవనం కూల్చివేత

పాతభవనం కూల్చివేత

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని మార్కండే యకాలనీ మెయిన్‌రోడ్డు రాజేశ్‌ థియేటర్‌ పక్కను న్న మూడంతస్తుల పాత భవనాన్ని మున్సిపల్‌ కా ర్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు శనివారం జేసీ బీ సాయంతో కూల్చివేశారు. బల్దియా సీనియర్‌ సి విల్‌ కాంట్రాక్టర్‌ డి.రాజమల్లుకు చెందన ఈ భవనం.. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందని, దానిని తొ లగించాలని అధికారులు చాలా ఏళ్లుగా నోటీసులు జారీచేస్తూ వస్తున్నారు. అయితే, తనకు పరిహారం కావాలని 2002లో రాజమల్లు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి ఈ వివాదం ఎటూ తేలలేదు. ప్రస్తుతం వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉండడంతో కూల్చివేసేందుకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారు లు నిర్ణయించారు. ఇదే విషయాన్ని భవన యజమానికి తెలియజేశారని తెలిసింది. శనివారం టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నవీన్‌, సిబ్బంది జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. వన్‌ టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

హఠాత్తుగా కూలిన భవనం..

జేసీబీలకు అమర్చిన బ్రేకర్‌తో పిల్లర్లను కూల్చివేస్తుండగా భవనం భారీ శబ్దంతో కుప్పకూలింది. ఏంజరిగిందో తెలుసుకునేలోపే జేసీబీపై శిథిలాలు పడ్డాయి. స్వల్పగాయాలతో డ్రైవర్‌ కిందకు దూకి పరుగులుపెట్టాడు. విద్యుత్‌ స్తంభాలపై కూడా శిథిలాలు పడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భవనం వెనకాలే ఉన్న ఓ ఫాస్టఫుడ్‌ సెంటర్‌ బాత్‌రూంలు, సామగ్రి ధ్వంసమయ్యాయి. అయితే, ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మరో రెండురోజుల వరకు ఈ ప్రాంతంలో రాకపోకలను నిలిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తమకు పరిహారం ఇవ్వకుండా భవనం కూల్చివేయడం సరికాదని యజమాని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

జేసీబీపై శిథిలాలు .. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement