
వారం కింద తెచ్చిన
వారం క్రితం ధాన్యం మార్కెట్కు తెచ్చా. నాలుగైదు రోజుల వ్యవధిలో రెండు సార్లు వానలు పడ్డాయి. రెండుసార్లు వడ్లు తడిసినయి. కొంత నీటిలో కొట్టుకు పోయింది. జాప్యం లేకుండా ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలి.
– సొల్లూరి మణికంఠ, రైతు, పెద్దపల్లి
పరిహారం చెల్లిస్తాం
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తాం. తడిసిన ప్రతీతిధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. రైతులు ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వానిదే.
– శ్రీధర్బాబు, రాష్ట్రమంత్రి
ఎక్కువ కొనుగోలు చేశాం
ధాన్యం తూకంలో జాప్యమేమీలేదు. గతేడాది మే 13నాటికి 2,11,449 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం వేస్తే, ప్రస్తుతం 2,18,392 మెట్రిక్ టన్నులు తూకం వేశాం. 82శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేశాం. – శ్రీహర్ష, కలెక్టర్
ఆందోళన వద్దు
ధాన్యం పండించిన రైతులు ఆందోళన పడొద్దు. అనుకోకుండా కురిసిన వానలకు తడిసిన ధాన్యంపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లండి. రంగు మారకుండా ఉంటుంది. చివరిగింజ వరకూ కొనేలా బాధ్యత తీసుకుంటాం.
– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి

వారం కింద తెచ్చిన

వారం కింద తెచ్చిన