
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మంథని: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రె స్ పన్నిన కుట్రలను పటాపంచలు చే సి ప్రజలకు వాస్తవాలను వివరించడానికి నియోజకవర్గంలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరి తీరంలో సోమవారం ఉదయం 11 గంటలకు చర్చా కార్యక్రమం ఏర్పా టు చేసినట్లు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తెలిపారు. బీఆర్ఎస్ మండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, దావ వసంతతోపాటు సాగనీటి నిపుణుడు వీరమల్ల ప్రకాశ్ హాజరవుతారని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్ర లపై ఇందులో కూలంకశంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గానికి చెందిన ప్రజలు, మేధావులు, తెలంగాణవాదులు హాజరై కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను, వాస్తవ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.