
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
పెద్దపల్లిరూరల్: ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వారికే కేటాయించేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రెండు రోజుల్లోగా తుదిజాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం పాలకుర్తి, అంతర్గాం మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షించారు. కమిటీల ద్వారా సేకరించిన జాబితాను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తుదిజాబితా ఖరారు చేయాలని అన్నా రు. పీడీ రాజేశ్వర్, తహసీల్దార్ జ్యోతి, పంచా యతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సీఎస్ను కలిసిన ఎమ్మెల్యే
గోదావరిఖని: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావును రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ శుక్రవారం కలిశారు. సీఎస్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సివిల్స్లో ఉచిత శిక్షణ
పెద్దపల్లిరూరల్: సివిల్స్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే మైనార్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ పొందేందుకు ఈనెల 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని జిల్లా ఇన్చార్జి మైనార్జీ సంక్షేమ అధికారి రంగారెడ్డి తెలిపారు. మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా 100మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఇందులో 33.33శాతం మహిళలు, దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. జూన్ 5న ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ఫోన్ నంబ రు 040–23236112లో సంప్రదించాలన్నారు.
6న జాబ్ మేళా
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేఎల్ గ్రూప్ సర్వీసెస్, మేడ్చల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 6న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. కలెక్టరేట్లోని ఉపాధి కల్పనాధికారి కా ర్యాలయంలో జరిగే జాబ్ మేళాకు టెన్త్ పాసై, 18నుంచి 35ఏళ్లలోపు వయసు గలవారు హాజరు కావాలన్నారు. వివరాలకు 63095 18695, 70931 72221, 89853 36947 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
20న సార్వత్రిక సమ్మె చేస్తాం : సీఐటీయూ
పెద్దపల్లిరూరల్: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాసేలా రూపొందిస్తున్న చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఈనెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ వేణు, కార్మికశాఖ కార్యాలయంలో శ్రీనాథ్కు శుక్రవారం సమ్మె నోటీసు అందజేశారు. కార్మిక శ్రేయస్సు ధ్యేయంగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్కోడ్లను అమలులోకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది కార్మికహక్కులను హరించడమేనని అన్నారు. ఈ క్రమంలో చేపట్టిన సమ్మెలో సంఘటిత, అసంఘటిత, ప్రభుత్వ రంగసంస్థల కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు. నా యకులు చందర్, సునీల్, వైకుంఠం, లక్ష్మణ్, సమ్మిరెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
పంపిణీకి సిద్ధంగా పెసర విత్తనాలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): రైతులకు పంపిణీ చేసేందుకు 30 క్వింటాళ్ల ఐపీఎల్– 410 –3 రకం పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. పెద్దపల్లి డీసీఎంఎస్లో 12 క్వింటాళ్లు, సుల్తానాబాద్ పీఏసీఎస్లో 5 క్వింటాళ్లు, రామగిరి ఏఆర్ఎస్కేలో 3 క్వింటాళ్లు, మంథని ఏఆర్ఎస్కేలో 6 క్వింటాళ్లు, కాల్వ శ్రీరాంపూర్ పీఏసీఎస్లో 2 క్వింటాళ్లు, ధర్మారం మండలం నందిమేడారం పీఏసీఎస్లో 2 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని ఆయన వివరించారు. అవసరమైన రైతులు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
క్వింటాల్ పత్తి రూ.7,125
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో శుక్రవారం పత్తి క్వింటాలు కు గరిష్టంగా రూ.7,125 ధర పలికిందని మా ర్కెట్ ఇన్చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. కనిష్టంగా రూ.6,325గా, సగటు రూ.6,825గా ఉందని ఆయన పేర్కొన్నారు.
సీఎస్కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్యే ఠాకూర్

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు