హామీల అమలు తర్వాతే ఓటడగాలి | - | Sakshi
Sakshi News home page

హామీల అమలు తర్వాతే ఓటడగాలి

Apr 18 2025 1:48 AM | Updated on Apr 18 2025 1:48 AM

హామీల అమలు   తర్వాతే ఓటడగాలి

హామీల అమలు తర్వాతే ఓటడగాలి

గోదావరిఖని(రామగుండం): గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటడగాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ పేరుతో ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. అబద్ధపు పాలన కారణంగానే కాంగ్రెస్‌ దేశంలో రెండు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందన్నారు. నాయకులు నీరటి శ్రీనివాస్‌, అచ్చే వేణు, అంజలి, ముద్దసాని సంధ్యారెడ్డి, చల్లా రవీందర్‌రెడ్డి, తిమోతి, మేడి సదయ్య, దాసరి బాలరాజు, శంకర్‌, శ్రావణ్‌, శేషగిరి, వాసు పాల్గొన్నారు.

విజయవంతం చేయాలి

రామగుండం: ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ విజయవంతం చే యాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ పిలుపునిచ్చారు. బ్రాహ్మణపల్లి పంపుహౌజ్‌ ప్రాంగణంలో అంతర్గాం, పాలకుర్తి మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బ్రాహ్మణపల్లి ఎత్తిపోతలను ప్రారంభించి పంటలకు నీరందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మురళీధర్‌రావు, గోపు అయిలయ్యయాదవ్‌, సంతోష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement