ముగిసిన ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

Jun 4 2025 12:33 AM | Updated on Jun 4 2025 12:33 AM

ముగిస

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

● ఈసారి ధాన్యం సేకరణలో జిల్లాదే అగ్రస్థానం ● 95శాతం రైతులకు చెల్లింపులు పూర్తి

సాక్షి, పెద్దపల్లి: అకాల వర్షాల మధ్య యాసంగి ధాన్యం కొనుగోళ్లు సజావుగానే పూర్తయ్యాయి. గింజ కోత లేకుండానే.. వానాకాలం సీజన్‌ ప్రా రంభానికి ముందే.. జూన్‌ తొలివారంలోపే కొనుగోళ్లు ముగిశాయి. దీంతో రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు.. అన్నదాత లు వానాకాలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సారి రికార్డుస్థాయిలో 315 కొనుగోలు కేంద్రాల్లో 3.98 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించా రు. 95 శాతం రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ధాన్యం సొమ్ము రూ.871.2 కోట్లు జమచేశారు. రాష్ట్రంలోనే ఇది ప్రథమ స్థానం అని అధికార యంత్రాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.

ధాన్యం డబ్బుల చెల్లింపుల్లో టాప్‌..

కొనుగోళ్లు తొలుత మందకోడిగా సాగినా.. అధి కారుల పర్యవేక్షణ, సమన్వయంతో ఆ తర్వాత వేగం పుంజుకున్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరించగానే రోజువారీ కొనుగోళ్ల వివరాలను ట్యాబ్‌ల్లో నమోదు చేయడం, కొనుగోలు కేంద్రా ల ఇన్‌చార్జిల నివేదికలను పౌర సరఫరాల మేనే జర్‌ పరిశీలించి, సమాచారం సరిగ్గా ఉంటే ఆన్‌లైన్‌లో డిజిటల్‌ సంతకంతో ఆమోదించారు. దీంతో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు నేరుగా జమయ్యాయి. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్ర భుత్వం డబ్బులు జమచేయాలనే లక్ష్యాన్ని జిల్లా యంత్రాంగం సాకారం చేసింది. హమాలీల కొరత తీర్చేందుకు బిహార్‌ కూలీలను రప్పించడం, లారీలు, గన్నీసంచులు అందుబాటులో ఉంచడంతో ఆటంకాలు లేకుండానే ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. దీంతో 315 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశారు.

బోనస్‌ కోసం ఎదురుచూపులు

యాసంగిలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సన్నధాన్యాన్ని రైతులు ఎక్కువగా సాగు చేయరు. కానీ, ప్రభుత్వం సన్నవడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లిస్తుండడంతో ఈసారి సన్నవడ్లను ఎక్కువగానే సాగు చేశారు. అయితే ప్రభు త్వం ధాన్యం డబ్బులు వెంటనే జమ చేస్తున్నా, ఇప్పటివరకు ఒక్క రైతు ఖాతాలో బోనస్‌ డబ్బు లు జమచేయలేదు. బోనస్‌ డబ్బులు వస్తే వానాకాలం సాగు పెట్టుబడికి అక్కరకు వస్తాయని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సమాచారం

సేకరించిన ధాన్యం(మెట్రిక్‌ టన్నుల్లో)3,98,006

విక్రయించిన రైతుల సంఖ్య: 60,020

కొనుగోలు చేసినదాని విలువ(రూ.కోట్లలో) 918.75

రైతులకు చేసిన చెల్లింపులు(రూ.కోట్లలో) 871.02

నమోదుచేసిన శాతం: 95

దొడ్డు రకం(మెట్రిక్‌ టన్నుల్లో): 3,20,244

సన్నరకం: 77,761

చెల్లించాల్సిన బోనస్‌(రూ.కోట్లలో): 38.8

సమన్వయంతోనే సక్సెస్‌

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 315 కేంద్రాలను ఏర్పాటు చేశాం. 2024 యాసంగిలో జూన్‌ 10న, 2023 యాసంగిలో జూన్‌ 15న కొనుగోళ్లు పూర్తిచేసి కొనుగోలు కేంద్రాలు మూసివేశాం. కానీ, ఈసారి జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో వర్షాలు ప్రారంభంకాకముందే కొనుగోళ్లు పూర్తి చేశాం. రికార్డుస్థాయిలో 95శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేశాం. మిగతా వారికి సైతం సాధ్యమైనంత త్వరలోనే ధాన్యం డబ్బులు జమచేస్తాం.

– శ్రీకాంత్‌, డీఎం, పౌర సరఫరాలు

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు1
1/1

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement